AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Attack: ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రదేశం గుర్తింపు.. ‘మిషన్ 54’ కోసం సిద్ధమైన భారత సైన్యం

పహల్గామ్‌లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. పహల్గామ్‌ అటవీ ప్రాంతంలో 54 రహదారుల్లో టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. మూలాల ప్రకారం, ఉగ్రవాదులు ప్రస్తుతం అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో దాక్కున్నట్లు తెలుస్తోంది. సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.

Pahalgam Attack: ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రదేశం గుర్తింపు.. 'మిషన్ 54' కోసం సిద్ధమైన భారత సైన్యం
Pahalgam Terror Attack
Balaraju Goud
|

Updated on: May 06, 2025 | 5:07 PM

Share

పహల్గామ్‌లో దాడి చేసిన వారి దాక్కున్న ప్రదేశాలు బయటపడ్డాయి. ఉగ్రవాదుల కోసం అన్వేషణ ఇప్పుడు 54 మార్గాలపై దృష్టి సారించింది. బైసరన్ లోయ నుండి 54 మార్గాలు వేర్వేరు దిశల్లో వెళ్తాయి. ఈ మార్గాల్లో కొన్ని దట్టమైన అడవులు, పర్వతాల వైపు పైకి వెళ్తాయి. మరికొన్ని మార్గాలు మైదానాలలో క్రిందికి వెళ్తాయి. ఈ మార్గాలు కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలకు అనుసంధానించబడి ఉన్నాయి.

ఈ అటవీ రహదారులలో సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల భారీ ఆపరేషన్ జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లను అరెస్టు చేశారు. భద్రతా దళాలు వారిని శోధన కార్యకలాపాల కోసం అడవులకు తీసుకెళ్తున్నాయి. అనేక చోట్ల దాక్కున్న ప్రదేశాలు కూడా కనుగొన్నారు. కానీ చాలా కాలంగా వాటిలో ఎవరూ నివసించడంలేదు. మూలాల ప్రకారం, ఉగ్రవాదులు ప్రస్తుతం అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో దాక్కున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు, కేవలం ముగ్గురు ఉగ్రవాదులు మాత్రమే పహల్గామ్ కాల్పుల్లో పాల్గొన్నట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. మిగిలిన కొంతమంది ఉగ్రవాదులు వెనుక నుండి సహకరించినట్లు భావిస్తున్నారు. ఉగ్రవాద దాడికి ముందు, పర్యాటక ప్రదేశాలపై రెక్కీ నిర్వహించిన దుండగులు, అదును చూసి కాల్పులకు తెగబడినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. కాగా, పహల్గామ్‌లో వివిధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి వచ్చే వారే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో నిరాయుధులైన ప్రజలు లక్ష్యంగా చేసుకున్నారు. ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు ప్రజలను వారి మతం గురించి అడిగిన తర్వాత చంపారు. ఈ దాడిలో, 26 మంది అమాయకులైన పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది.

దీంతో పాటు, ఉగ్రవాద నిర్మూలన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు చేస్తోంది. గతంలో అరెస్టు చేసిన ఓవర్ గ్రౌండ్ వర్కర్లను NIA విచారించి, ఆధారాలను సేకరిస్తోంది. ఇదిలావుంటే, ఇప్పటికే ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. TRF అనేది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..