Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi On 10 Years Of OROP: దశాబ్ధం పూర్తి చేసుకున్న ‘ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్’ పథకం.. ప్రధాని మోదీ భావోధ్వేగ ట్వీట్‌ వైరల్

మోదీ సర్కార్ పదేళ్ల క్రితం మాజీ సైనికుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన 'ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్' పథకం నేటితో దశాబద్ధం పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. ఈ పథకం మన వీరులకు దేశం ఇస్తున్న నివాళిగా కొనియాడారు. సైనికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని అన్నారు..

PM Modi On 10 Years Of OROP: దశాబ్ధం పూర్తి చేసుకున్న 'ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్' పథకం.. ప్రధాని మోదీ భావోధ్వేగ ట్వీట్‌ వైరల్
PM Modi On 10 Years Of OROP
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 07, 2024 | 11:22 AM

న్యూఢిల్లీ, నవంబర్‌ 7: మాజీ సైనికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేస్తూ గురువారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మాజీ సైనికులకు ‘వన్‌ ర్యాంక్ వన్ పెన్షన్’ అమలు చేయడం మన వీరులకు దేశం నివాళి తెల్పడంతో కీలకమైన ఘట్టమని అన్నారు. ఈ మేరకు మోదీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

మోదీ పోస్టులో ఇంకా ఈ విధంగా పేర్కొన్నారు.. ‘వన్‌ ర్యాంక్, వన్‌ పెన్షన్’ (OROP) పథకం మాజీ సైనికుల ధైర్యం, త్యాగాలకు నివాళి అని కొనియాడారు. పదేళ్ల క్రితం 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ వాగ్దానం చేసిన పథకం ఈ రోజున ‘వన్‌ ర్యాంక్, ఒక పెన్షన్’ (OROP) అమలులోకి వచ్చింది. గురువారంతో దశాబ్ధం పూర్తైంది. మన దేశాన్ని రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన మన మాజీ సైనిక సిబ్బంది ధైర్యం, త్యాగాలకు ఇది నివాళి. OROPని అమలు చేయాలనే నిర్ణయం మన హీరోలకు మన దేశ కృతజ్ఞతను పునరుద్ఘాటించడంలో ఇదొక ముఖ్యమైన అడుగు. దశాబ్ద కాలంగా లక్షలాది మంది పెన్షనర్లు, పెన్షనర్ కుటుంబాలు ఈ మైలురాయి చొరవతో లబ్ది పొందడం సంతోషాన్ని కలిగిస్తుంది. మన సాయుధ బలగాల శ్రేయస్సు పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను OROP సూచిస్తుంది. సాయుధ బలగాలను బలోపేతం చేయడానికి, దేశానికి సేవ చేసే వారి సంక్షేమం కోసం సాధ్యమైన ప్రతిదాన్ని చేయడానికి తమ ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) పథకం 10వ వార్షికోత్సవాన్ని నవంబర్ 7 నుండి 8 వరకు ఢిల్లీలోని మానేక్షా సెంటర్‌లో డైరెక్టర్స్ కాన్‌క్లేవ్‌తో పాటు జరుపుకోనున్నారు. OROP పథకం అమలులోకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా నవంబర్ 7న జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు. OROP అమలులోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 25 లక్షల మందికి పైగా ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆంధ్రా రొయ్యకు అమెరికా దెబ్బ.. కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ
ఆంధ్రా రొయ్యకు అమెరికా దెబ్బ.. కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ
ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే కలిగే అద్భుత ఫలితాలు ఇవే..
ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే కలిగే అద్భుత ఫలితాలు ఇవే..
భారత్‌లో 7 సీట్ల కారుకు భారీ డిమాండ్.. మొదటి స్థానంలో ఏ కారు అంటే
భారత్‌లో 7 సీట్ల కారుకు భారీ డిమాండ్.. మొదటి స్థానంలో ఏ కారు అంటే
చేదు కాకరకాయతో చెప్పలేని లాభాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
చేదు కాకరకాయతో చెప్పలేని లాభాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..
పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..
ఎన్నో ఏళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ బైక్‌లు ఇకపై భారతదేశంలో ఉండవు!
ఎన్నో ఏళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ బైక్‌లు ఇకపై భారతదేశంలో ఉండవు!
కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్..
కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్..
అయ్యో భగవంతుడా.. పసివాడి ఉసురు తీసిన ఊర కుక్క..
అయ్యో భగవంతుడా.. పసివాడి ఉసురు తీసిన ఊర కుక్క..
ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు సమస్యలకు చెక్ పడినట్టే!
ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు సమస్యలకు చెక్ పడినట్టే!
ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్..
ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్..