తేజస్వీయాదవ్‌తో రహస్య ఒప్పందాలేమీ లేవు ః చిరాగ్‌ పాశ్వాన్‌

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. పార్టీలన్నీ అధికారం తమదే అన్న నమ్మకంతో ఉన్నాయి.. ఈసారి ఒంటరిగా బరిలో దిగిన లోక్‌ జనశక్తి పార్టీ కనీసం మూడునాలుగు స్థానాలలో విజయం సాధించవచ్చని సర్వేలు చెబుతున్నాయి..

తేజస్వీయాదవ్‌తో రహస్య ఒప్పందాలేమీ లేవు ః చిరాగ్‌ పాశ్వాన్‌
Follow us

|

Updated on: Oct 27, 2020 | 12:10 PM

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. పార్టీలన్నీ అధికారం తమదే అన్న నమ్మకంతో ఉన్నాయి.. ఈసారి ఒంటరిగా బరిలో దిగిన లోక్‌ జనశక్తి పార్టీ కనీసం మూడునాలుగు స్థానాలలో విజయం సాధించవచ్చని సర్వేలు చెబుతున్నాయి.. అయితే లోక్‌జనశక్తి పార్టీ వల్ల నష్టపోయేది ఎవరన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు రాజకీయ విశ్లేషకులు.. అధికార పార్టీ కూటమికి ఇది మైనస్‌గా మారుతుందా? లేక విపక్ష మహా కూటమి ఓట్లను చీలుస్తుందా అన్నది అంతుపట్టకుండా ఉంది.. అయితే ఆ పార్టీ అధినేత చిరాగ్‌ పాశ్వాన్ మాత్రం తాను ఎట్టిపరిస్థితుల్లో ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వనని, తమ పార్టీ బీజేపీ ముఖ్యమంత్రికి మాత్రమే బాసటగా నిలుస్తుందని స్పష్టం చేశారు.. రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకుడు తేజస్వీ యాదవ్‌తో చిరాగ్‌ పాశ్వాన్‌ రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారంటూ బీజేపీ- జనతాదళ్‌ యునైటెడ్‌ చేస్తున్న ఆరోపణలను చిరాగ్‌ ఖండించారు. తమ పార్టీ ఆర్‌జేడీ- కాంగ్రెస్‌ కూటమి అయిన మహాగడ్బంధన్‌కు కానీ, జనతాదళ్‌ యునైటెడ్‌కు కానీ సపోర్ట్‌ చేసే అవకాశమే లేదన్నారు.. కావాలంటే రాసిపెట్టుకోమని సవాల్‌ విసిరారు.. ఒకవేళ నితీశ్‌కుమార్‌నే సీఎం చేయాలని బీజేపీ భావిస్తే తాము తటస్టంగా ఉంటామే తప్ప ఆ కూటమిలో చేరమని చిరాగ్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. డబుల్‌ ఇంజన్‌ కీ సర్కార్‌ ఉండాలన్నది తన అభిమతమని చెప్పారు చిరాగ్‌. అంటే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీనే అధికారంలో ఉండాలన్నది చిరాగ్‌ కోరుకుంటున్నారు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??