AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lightning: పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. పిడుగుపాటుకు గురై 14 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఏకంగా 14 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. గురువారం రోజున ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిశాయి.

Lightning: పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. పిడుగుపాటుకు గురై 14 మంది మృతి
Lightning
Aravind B
|

Updated on: Apr 28, 2023 | 7:53 AM

Share

పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఏకంగా 14 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. గురువారం రోజున ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిశాయి. పుర్బ బర్దమాన్ జిల్లాలోనే పిడుగుపాటుకు గురై నలుగురు మృతి చెందారు. అలాగే ముర్షిదాబాద్ జిల్లాలో ఇద్దరు, నార్త్ 24 పర్గానాస్ జిల్లాల్లో మరో ఇద్దరు ప్రాణాలు విడిచినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి తెలిపారు. పశ్చిమ్ మిడ్నాపూర్ జిల్లాలో ముగ్గురు, హౌరా రూరల్ జిల్లాలో మరో ముగ్గురు పిడుగులు పడి చనిపోయినట్లు వెల్లడించారు.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పిడుగుల వల్ల చనిపోయిన వారిలో చాలామంది రైతులే కావడం బాధాకారం. వీళ్లందరూ తమ వ్యవసాయ క్షేత్రాల్లో పని చేస్తుండగానే ఒక్కసారిగా పిడుగు పడటంతో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే గురువారం సాయంత్రం మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడినట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..