AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఐపీఎల్‌లో ఎవరూ కొనుగోలు చేయలేదు.. కట్‌చేస్తే.. 11 సిక్సర్లు, 18 ఫోర్లతో 245 పరుగులు.. ఎవరంటే?

Sri Lanka vs Ireland, 2nd Test: ఐర్లాండ్‌తో జరుగుతున్న గాలె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇద్దరు శ్రీలంక బ్యాట్స్‌మెన్స్ డబుల్ సెంచరీలు సాధించగా, కుశాల్ మెండిస్ 291 బంతుల్లో 245 పరుగులు చేశాడు.

Viral: ఐపీఎల్‌లో ఎవరూ కొనుగోలు చేయలేదు.. కట్‌చేస్తే.. 11 సిక్సర్లు, 18 ఫోర్లతో 245 పరుగులు.. ఎవరంటే?
Kusal Mendis Nishan Madushk
Venkata Chari
|

Updated on: Apr 28, 2023 | 5:25 AM

Share

ఓ వైపు భారత్‌లో ఐపీఎల్ 2023 జరుగుతుండగా, మరోవైపు పొరుగు దేశం శ్రీలంకలో టెస్టు సిరీస్‌ జరుగుతోంది. శ్రీలంక, ఐర్లాండ్ మధ్య గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ అద్భుత ప్రదర్శన చేశారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ కుశాల్‌ మెండిస్‌, నిషాన్‌ మదుష్క అద్భుత డబుల్‌ సెంచరీలు చేశారు. మదుష్క 205 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, కుసాల్ మెండిస్ 291 బంతుల్లో 245 పరుగులు చేశాడు.

కుశాల్ మెండిస్ టెస్టుల్లో వన్డే క్రికెట్ తరహాలో తన ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ స్ట్రైక్ రేట్ 84.19, అతని బ్యాట్ నుంచి మొత్తం 29 బౌండరీలు వచ్చాయి. మెండిస్ 11 సిక్సర్లు, 18 ఫోర్లు బాదాడు.

ఐపీఎల్‌లో మెండిస్‌కు అవకాశం రాలేదు..

ఐపీఎల్ 2023లో కుసాల్ మెండిస్ ఆడాలనుకున్నాడు. వేలంలో తన పేరును కూడా ఇచ్చాడు. అయితే మెండిస్‌పై ఏ జట్టు కూడా బెట్టింగ్‌లు వేయలేదు. మెండిస్ బేస్ ధర రూ.50 లక్షలుగా నిలిచింది. కాగా, మెండిస్ ఇప్పుడు గాలెలో అద్భుతమైన డబుల్ సెంచరీతో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తొలి టెస్టులో కుశాల్ మెండిస్ కూడా సెంచరీ చేశాడు. అతని బ్యాట్ 193 బంతుల్లో 140 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

చరిత్ర సృష్టించిన నిషాన్ మదుష్క..

కాగా, కుశాల్ మెండిస్‌తో పాటు శ్రీలంక యువ ఓపెనర్ నిషాన్ మదుష్క కూడా చరిత్ర సృష్టించాడు. ఈ 23 ఏళ్ల బ్యాట్స్‌మెన్ 339 బంతుల్లో 205 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో తొలిసారిగా శతకం సాధించిన మదుష్క దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. ఈ ఘనత సాధించిన రెండో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ మదుష్క. 1987లో బ్రాండన్ కురుప్పు కూడా ఇలాంటి ఫీట్ చేశాడు.

కరుణరత్నే-మాథ్యూస్ కూడా సెంచరీలు బాదారు..

మదుష్క, కుశాల్ మెండిస్‌లు డబుల్ సెంచరీలు బాదడమే కాదు.. వారితో పాటు ఏంజెలో మాథ్యూస్-దిముత్ కరుణరత్నే కూడా అద్భుత సెంచరీని నమోదు చేశారు. కెప్టెన్ కరుణరత్నే 115 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో ఏంజెలో మాథ్యూస్ అజేయంగా 100 పరుగులతో నిలిచాడు. శ్రీలంక స్కోరు కూడా 700 దాటింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..