AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kallakurichi Hooch Tragedy: కల్తీ మద్యం ఘటనలో 63కి పెరిగిన మృత్యుల సంఖ్య.. కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఏఐఏడీఎంకే డిమాండ్‌

తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనతో రాష్ట్రం రావణకాష్ఠలా రగిలిపోతుంది. తాజాగా మరో ఇద్దరు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకూ కల్తీసారా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 63కు పెరిగింది. మరో 78 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో ప్రాణాలతో..

Kallakurichi Hooch Tragedy: కల్తీ మద్యం ఘటనలో 63కి పెరిగిన మృత్యుల సంఖ్య.. కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఏఐఏడీఎంకే డిమాండ్‌
Kallakurichi Hooch Tragedy
Srilakshmi C
|

Updated on: Jun 27, 2024 | 8:51 PM

Share

చెన్నై, జూన్‌ 27: తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనతో రాష్ట్రం రావణకాష్ఠలా రగిలిపోతుంది. తాజాగా మరో ఇద్దరు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకూ కల్తీసారా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 63కు పెరిగింది. మరో 78 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెన్నైలో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు గురువారం నిరాహారదీక్ష చేపట్టారు. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నాడీఎంకే నేతలు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. బాధ్యులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఏఐఏడీఎంకే సీనియర్‌ నేత సి పొన్నయన్‌ మాట్లాడుతూ.. ‘స్టాలిన్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నదే మా డిమాండ్‌. కేవలం డీఎంకే కార్యకర్తలే కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో చలగాటం అడుతున్నారు. నిషేధిత డ్రగ్స్ దురాగతాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న వారికి స్టాలిన్, అతని ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకే నేత డి జయకుమార్ మాట్లాడుతూ.. ‘దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి. సీబీఐకి అప్పగించే వరకు ఆందోళన కొనసాగిస్తాం. డీఎంకే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంది. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం మాకు ఇవ్వడం లేదు. ఇది తమిళనాడు బర్నింగ్ ఇష్యూ’ అని పేర్కొన్నారు. కాగా ఏఐఏడీఎంకే నేత, ప్రతిపక్ష నేత (ఎల్‌ఓపీ) ఎడప్పాడి పళనిస్వామి, ఇతర సీనియర్ నేతలు సమ్మెలో పాల్గొంటున్నారు.

మరోవైపు కల్తీ మద్యం ఘటనపై ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో సస్పెన్షన్‌ వేటు పడింది. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేల‌పై స‌స్పెన్షన్ విధించారు. అసెంబ్లీ స‌మావేశాల‌ను అడ్డుకుంటున్నారన్న నెపంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌ను స‌భా నుంచి పంపించివేయాలంటూ త‌మిళ‌నాడు స్పీక‌ర్ ఎం అప్పవు ఆదేశించారు. కళ్లకురిచి జిల్లా కలెక్టరేట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. బుధవారం సాయంత్రం నాటికి హూచ్ విషాదంలో మరణించిన వారి సంఖ్య 63 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో మొత్తం 78 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 48 మంది కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరగా, 66 మంది డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..