క్యారీ బ్యాగ్ కాదు.. టైమ్ బాంబ్.. కౌంట్ డౌన్ ఎప్పుడో మొదలైంది..!
నేల లేదా నీటిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ విచ్ఛిన్నం కావడానికి వేల ఏండ్లు పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 40 నుంచి 50 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. వాటిలో 40 నుంచి 50 శాతం వరకు యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వస్తువులే. భూమిపై నుంచి ఏటా దాదాపు 8 నుంచి 10 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మహాసముద్రాలలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ కారణంగా భూమి, సముద్రాల్లో ఉండే జీవజాతుల ఉనికి ప్రమాదంలో పడుతోంది.

ప్లాస్టిక్.. ఈ ఒక్క పదమే ఇప్పుడు భూమండలాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఇందుగలడందులేడని సందేహము వలదు.. అనే పద్యం ప్లాస్టిక్కు అతికినట్లు సరిపోతుంది. మారుతున్న జీవన శైలిలో మనం రోజూ ప్లాస్టిక్ను తింటున్నాం.. ప్లాస్టిక్ను తాగుతున్నాం.. ప్లాస్టిక్ను విసర్జిస్తున్నాం అంటే అతిశయోక్తి కాదేమో. మానవ జీవితంతో ప్లాస్టిక్ ఫెవికోల్లా అతుక్కుపోయింది. విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం వల్ల భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని ఇలా పంచభూతాలు కాలుష్య రక్కసి పిడికిలిలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కేవలం భూమండలాన్నే కాదు మహా సముద్రాలను సైతం ప్లాస్టిక్ భూతం మింగేస్తుండటంతో పర్యావరణం పేలేందుకు సిద్ధంగా ఉన్న బాంబులా తయారవుతోంది. కాలువలు, నదుల ద్వారానే ఏటా దాదాపు ఒకటిన్నర కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 కల్లా దాదాపు 2.9 కోట్ల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సముద్రాల్లో పేరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. మనుషులు చేసే విచ్చలవిడి తప్పిదానికి పర్యావరణం, జీవావరణం ప్రశ్నార్థకంగా మారుతోంది. సముద్రాల్లో ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణ, జీవవైవిద్య సమస్యగా మారుతోంది. మహాసముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం సమస్త జీవరాశులపై ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉంది. నేల లేదా నీటిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ విచ్ఛిన్నం కావడానికి వేల ఏండ్లు పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 40 నుంచి 50 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. వాటిలో 40 నుంచి 50...




