రవికుమార్ పాణంగిపల్లి. దాదాపు 19 ఏళ్లుగా ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో పాత్రికేయునిగా పని చేస్తున్నారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో శిక్షణ అనంతరం ఈటీవీతో కెరియర్ ప్రారంభించారు. అనంతరం ఎన్టీవీలో స్టోరీ బోర్డ్ ఎడిటోరియల్ ప్రోగ్రామ్ కోసం సుమారు ఏడాదిన్నర పాటు స్క్రిప్ట్ రైటర్, ప్రొడ్యూసర్గా పని చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో సీనియర్ జర్నలిస్టుగా, జీ 24 గంటలులో ఔట్ పుట్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2017 నుంచి 2022 వరకు ఐదేళ్ల పాటు బీబీసీ వరల్డ్ సర్వీసెస్లో బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం టీవీ9 డిజిటల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సమకాలీన స్థానిక, జాతీయ రాజకీయాలపై విశ్లేషణలు… అంతర్జాతీయ, ఫీచర్ కథనాలు రాస్తుంటారు.
2030 నాటికి భారతీయులు తమ వంట గదులకు తాళాలేస్తారా? మూడు పూట్లా హోటళ్లలోనే తింటారా?
తాజాగా నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా NRAI ఓ నివేదికను విడుదల చేసింది. అది రెస్టారెంట్స్ అసోసియేషన్ కనుక.. కేవలం రెస్టారెంట్లకు సంబంధించిన వివరాలు మాత్రమే అందించింది. ఆ లెక్కల ప్రకారం హైదరాబాద్లో ఉన్న మొత్తం రెస్టారెంట్ల సంఖ్య అక్షరాల 74వేల 807. ఇందులో వ్యవస్థీకృతంగా ఏర్పాటు చేసినవి 41వేల144. ఇవి కాకుండా నగరంలో 16వేల 379 క్లౌడ్ కిచెన్లు ఉన్నాయి. వీటితో పాటు క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు 13 వేల 544, అలాగే క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్లు మరో 6వేల468 ఉన్నాయి.
- Ravi Panangapalli
- Updated on: Jul 23, 2024
- 9:49 am
కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది..? ప్రధాన మంత్రులు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారా?
నిజానికి 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశానికి బడ్జెట్ రెడీ చెయ్యడం అంత ఆషామాషీ విషయం కాదు. దీనికి చాలా పే.. ద్ద ప్రాసెస్ ఉంటుంది. వేర్వేరు రంగాలకు చెందిన స్టేక్ హోల్టర్స్ కలిసి.. నెలల కొద్దీ కష్టబడి బడ్జెట్ కసరత్తు పూర్తి చేస్తారు.
- Ravi Panangapalli
- Updated on: Jul 20, 2024
- 5:30 pm
మేము క్షేమం… కానీ ఎప్పుడొస్తామో తెలీదు… ఇంకా అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్, విల్ మోర్, ఎటూ తేల్చని నాసా!
సునితా, విల్ మోర్ ఇద్దరూ జూన్ 5వ తేదీన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షానికి వెళ్లారు. వాళ్లది కేవలం వారం రోజుల ప్రయాణం మాత్రమే. కానీ త్రస్టర్ మాల్ ఫంక్షన్స్, హీలియం లీకేజీల కారణంగా వాళ్ల ప్రయాణం వాయిదా పడింది. అలా వాయిదా పడిన రిటర్న్ జర్నీ..తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. బుధవారం నాసా అధికారులు జూలై నెలాఖరకు రావచ్చేమో అని భావిస్తున్నట్టు చెప్పారు. అంతే తప్ప... పంపించడానికి డేట్ ఫిక్స్ చేసినట్టు తిరిగి రప్పించడానికి మాత్రం డేట్, టైం ఇప్పటి వరకు ఫిక్స్ చెయ్యలేకపోతున్నారు.
- Ravi Panangapalli
- Updated on: Jul 13, 2024
- 1:27 pm
టీమిండియాకు బీసీసీఐ ప్రకటించిన 125 కోట్ల ప్రైజ్ మనీలో … గ్రౌండ్ ముఖం చూడని క్రికెటర్లకు కూడా వాటా ఉందా?
అక్షరాల 125 కోట్లు... టీం ఇండియా టీ -20 వరల్డ్ కప్ గెల్చిన తర్వాత బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్ మనీ. అంత మొత్తం ఎనౌన్స్ చెయ్యగానే... అభిమానులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతే కాదు.. ఆ తర్వాత చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. అందులో అతి ముఖ్యమైనది ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు..? అంటే 125 కోట్లను టీం ఇండియాకు ఎలా పంచుతారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. టీంకి అంటే ఆ రోజు గెల్చిన జట్టులో ఉన్న సభ్యులకా..? లేదా కోచ్లు, క్రికెటర్లు, ఇతర స్టాప్ ఇలా అందరికీనా..? అందరికీ సమానంగా పంచుతారా..? లేదా సీనియార్టీ ప్రకారం పంచుతారా? ఇలా ఎన్నో సందేహాలు
- Ravi Panangapalli
- Updated on: Jul 9, 2024
- 1:01 pm
గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి మోసాలు జరిగే ఛాన్సుంది? మీరు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
బంగారంపై రుణాలిచ్చే వ్యాపారంలో ఈ మధ్య కాలంలో చాలా అక్రమాలు, అవకతవకలు పెరుగుతూ ఉండటంతో అటు కేంద్ర ఆర్థిక శాఖ, అలాగే రిజర్వ్ బ్యాంకు కూడా అలెర్ట్ అయ్యాయి. కొన్ని కంపెనీలు నిబంధనలను కాలరాస్తున్నాయన్న విషయాన్ని ఆర్థిక శాఖ గుర్తించింది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ గోల్డ్లోన్ విధానాలను సమీక్షించుకోవాలని ఆర్థిక శాఖ కోరింది.
- Ravi Panangapalli
- Updated on: Jul 9, 2024
- 8:51 am
Team India: టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ.. ఆటగాళ్లకు ఎంతెంత..?
తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం... ఆ మొత్తంలో మెజార్టీ భాగాన్ని ప్లేయర్లకు, అలాగే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కి ఇస్తారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్ట్ ప్రకారం ప్లేయర్లంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడనివారిని కూడా లెక్కలోకి తీసుకుంటారు. అంటే 15 మంది టీంతో పాటు హెడ్ కోచ్ ద్రవిడ్ కూడా అని అర్థం. ఇలా ఆ మొత్తం 16 మందికి ఒక్కొక్కరికీ 5 కోట్ల రూపాయల చొప్పున ఇస్తారు.
- Ravi Panangapalli
- Updated on: Jul 8, 2024
- 12:54 pm
గరిటడైన చాలు గాడిద పాలు… ఇప్పుడు నెల నెలా లక్షలు సంపాదించే సరికొత్త మార్గం ఇదేనా?
తాజా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా సుమారు 142 ఫాంలు ఉన్నాయి. ఒక్కో ఫాంలో కనీసం 50 గాడిదలను సాకుతున్నట్టు లెక్కలు చూసినా దాదాపు దేశ వ్యాప్తంగా మరో 7 వేల గాడిదలు అదనంగా ఉండే అవకాశం ఉంది.
- Ravi Panangapalli
- Updated on: Jul 2, 2024
- 10:15 am
Watch Video: ఇంకా స్పేస్ స్టేషన్లోనే సునీతా విలియమ్స్… మస్క్ వైపే అందరి చూపు..!
ఏ ముహూర్తానా రోదసి యాత్ర అని ప్రకటించారో అప్పటి నుంచి అడుగడుగునా ఆటంకాలతోనే సాగుతోంది. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వారిద్దర్నీ రోదసిలోకి తీసుకెళ్లింది. నిజానికి ఈ ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో వాయిదా పడింది. ఆ తర్వాత లోపాల్ని సవరించిన స్టార్ లైనర్ వారిని జూన్ 5 సురక్షితంగా స్పేస్కి పంపించింది. ఇదుగో ఇవి సునీత విలియమ్స్ స్సేప్ క్రాఫ్ట్లో ఆ రోజు అడుగుపెడుతున్న దృశ్యాలివి. మూడోసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన సునీత ఆనందంతో డ్యాన్స్ చేశారు కూడా.
- Ravi Panangapalli
- Updated on: Jun 29, 2024
- 12:35 pm
లేటు వయసులో పెళ్లి.. లేటెస్ట్ ట్రెండా..? లాభమెంత..? నష్టమెంత?
యువత తమ కాళ్లపై తాము నిలబడి ఉన్నత స్థానాలకు ఎదగాలన్న కోరికతో పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఫలితంగా చేసుకోవాల్సిన వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. ఆ తర్వాత కనాల్సిన వయసులో పిల్లల్ని కూడా కనడం లేదు. నిజానికి ఒకప్పుడు బాల్య వివాహాలు ఈ దేశంలో పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు నగరాల్లో బాల్య వివాహాలకు బదులు ఆలస్యంగా వివాహం కావడం అన్నది సర్వ సాధారణంగా మారిపోతోంది.
- Ravi Panangapalli
- Updated on: Jun 29, 2024
- 11:44 am
Watch Video: ఇండియా దగ్గర 172.. పాకిస్తాన్ దగ్గర 170.. ఇది అణ్వాస్త్రాల లెక్క
ఓ వైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ రక్షణ కోసం ఆయుధాలను సమకూర్చుకోవడానికి మాత్రం పాక్ పెద్ద పీట వేస్తోంది. అందుకే తమ అణ్వాయుధాల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తోంది. తాజాగా స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ -సిప్రీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నట్టు తెలుస్తోంది.
- Ravi Panangapalli
- Updated on: Jun 20, 2024
- 1:50 pm
అబ్బాయి మెడలో.. అమ్మాయి తాళి కడితే తప్పేంటి..?
పెళ్లంటే ... పేదంటి తండ్రికి మోయలేనంత భారం... డబ్బుకు కొదువ లేని శ్రీమంతులకు చెప్పలేనంత ఆడంబరం... పెళ్లికి ముందు చేసుకునే సంబరాలకే ఈ దేశంలో వేల కోట్ల ఖర్చు పెట్టే శ్రీమంతులున్నారన్న విషయం.. నిన్న గాక మొన్నే అంబానీలింట వేడుకలతో యావత్ ప్రపంచానికి అర్థమయ్యింది. అయితే అందుకు పూర్తిగా విరుద్ధమైన సంఘటనలకు ఈ దేశంలో ఏ మాత్రం కొదువలేదన్నది కూడా జగమెరిగిన సత్యం.
- Ravi Panangapalli
- Updated on: Jun 19, 2024
- 12:13 pm
ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ నీళ్లు తాగితే…డబ్బిచ్చి రోగాలు కొని తెచ్చుకున్నట్టేనా?
ప్యాక్ చేసిన నీళ్లే... ఇప్పుడు మనం ప్రాణాలు తీసే ప్రమాదం ఉందంటున్నాయి పరిశోధనలు. ఈ క్షణం వరకు అవే సురక్షితం అనుకొని డబ్బిచ్చి మరీ కొనుక్కొని తాగుతున్న నీళ్లు ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. కాస్త లోతుల్లోకెళ్లి గణాంకాలను పరిశిలీస్తే.. ఇప్పుడు మనం ఈ ప్యాక్ చేసిన నీళ్ల సీసాలకు పూర్తిగా అలవాటు పడిపోయామన్న విషయం అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో మనం చెయ్యాల్సిందేంటి?
- Ravi Panangapalli
- Updated on: Jun 13, 2024
- 12:58 pm