Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్-బంగ్లాదేశ్ ఒక్కటవుతున్నాయా? అదే జరిగితే భారత్ పరిస్థితేంటి?

ఆగస్టులో బంగ్లాదేశ్ జాతి పితగా భావించే షేక్ ముజ్మీర్ రెహ్మాన్ విగ్రహాన్ని కూలదోసినప్పటి నుంచే... ఆయన నినాదాలు, ఆయన ఆశయాలు, ఆయన మార్గం అన్నింటినీ బంగ్లాదేశ్ మర్చిపోయినట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు ఏ పాకిస్తాన్‌ను కాదని భారత్ సాయంతో స్వతంత్రం సంపాదించుకుందో.. ఇప్పుడు

పాకిస్తాన్-బంగ్లాదేశ్ ఒక్కటవుతున్నాయా? అదే జరిగితే భారత్ పరిస్థితేంటి?
Bangladesh–Pakistan relations
Follow us
Ravi Panangapalli

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 02, 2024 | 7:53 PM

సరిగ్గా ఈ డిసెంబర్ 16 నాటికి బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఏర్పడి 53 ఏళ్లు పూర్తవుతాయి. పాకిస్తాన్‌ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడటానికి భారత్ కారణం అన్న సంగతి బహుశా చరిత్ర చదువుకున్న ఈ తరానికి లేదా చరిత్రపై ఆసక్తి ఉన్న వారికి తప్ప 3 పదులు నిండిన వాళ్లకు పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అదే బంగ్లాదేశ్ భారత్‌ను పక్కన పెట్టేసి… పొరుగునున్న వారి పాత శత్రువు.. మనకు చిరకాల శత్రువు అయిన పాకిస్తాన్‌తో చేతులు కలుపుతోంది. దేశంలో 11 శాతం మంది ఉన్న హిందూ మైనార్టీలపై దాడులు చేస్తూ వారిని భయకంపితుల్ని చేస్తోంది. అలాంటిదేం లేదని… హిందువులకు పూర్తి రక్షణ ఇస్తున్నామని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ చెబుతున్నప్పటికీ ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ దాస్ అరెస్ట్.. ఆ తర్వాత పరిణామాలు చూస్తున్న వారికి ఆయన మాటలు వట్టి గాలి మాటలే అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతోంది. పాక్ పంచన చేరేందుకు తహతహ ఆగస్టులో బంగ్లాదేశ్ జాతి పితగా భావించే షేక్ ముజ్మీర్ రెహ్మాన్ విగ్రహాన్ని కూలదోసినప్పటి నుంచే… ఆయన నినాదాలు, ఆయన ఆశయాలు, ఆయన మార్గం అన్నింటినీ బంగ్లాదేశ్ మర్చిపోయినట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు ఏ పాకిస్తాన్‌ను కాదని భారత్ సాయంతో స్వతంత్రం సంపాదించుకుందో.. ఇప్పుడు అదే బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో పాక్ పంచన ఉంటేనే సుఖంగా ఉంటుందని భావిస్తున్నట్టు అర్థమవుతోంది. కొద్ది వారాల...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి