Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Election: జమ్మూ కాశ్మీర్‌లో ముగిసిన నాలుగో దశ ఎన్నికల ప్రచార సందడి.. పోలింగ్ ఏర్పాట్లలో ఈసీ

జమ్మూ కాశ్మీర్‌లో నాలుగో దశ ఎన్నికల ప్రచార సందడి శనివారం (మే 11) సాయంత్రంతో ముగిసింది. నాలుగో దశలో జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అప్నీ పార్టీ, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తూ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించారు.

Lok Sabha Election: జమ్మూ కాశ్మీర్‌లో ముగిసిన నాలుగో దశ ఎన్నికల ప్రచార సందడి.. పోలింగ్ ఏర్పాట్లలో ఈసీ
Jammu Kashmir Polling
Follow us
Balaraju Goud

|

Updated on: May 11, 2024 | 8:29 PM

జమ్మూ కాశ్మీర్‌లో నాలుగో దశ ఎన్నికల ప్రచార సందడి శనివారం (మే 11) సాయంత్రంతో ముగిసింది. నాలుగో దశలో జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అప్నీ పార్టీ, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తూ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించారు. శ్రీనగర్ పార్లమెంట్ స్థానానికి జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ అభ్యర్థి అష్రఫ్ మీర్ పోటీలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి అఘా రుహుల్లా ఇక్కడ ఎన్నికల రంగంలో ఉన్నారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల పోరులో పీడీపీకి చెందిన వహీద్ పారా కూడా పాల్గొంటున్నారు.

శ్రీనగర్ స్థానంపై ఏ పార్టీల మధ్య పోటీ?

అప్నీ పార్టీ అభ్యర్థులు అష్రఫ్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్ నుండి అఘా రుహుల్లా, పీడీపీ నుండి వహీద్ పారా శ్రీనగర్‌లో అనేక ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించి తమకు ఓటు వేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అష్రఫ్ మీర్ సోన్వార్ నుండి మాజీ PDP ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఒమర్ అబ్దుల్లాపై విజయం సాధించారు.

జమ్మూ కాశ్మీర్‌లో 5 దశల్లో ఎన్నికలు

జమ్మూకశ్మీర్‌లో 5 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫరూక్ అబ్దుల్లా పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ ), పీపుల్స్ కాన్ఫరెన్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ అప్నీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఎన్నికల పోరులో ఉన్నాయి. ఎన్నికల్లో పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌కు బీజేపీ మద్దతిస్తోందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ నేతలు చాలాసార్లు పేర్కొన్నారు.

ఏ స్థానానికి ఓటింగ్ జరుగుతుంది?

జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్ లోక్‌సభ స్థానానికి తొలి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. అదే సమయంలో, ఏప్రిల్ 26న జమ్మూలో రెండో దశలో ఓటింగ్ జరిగింది. అనంత్‌నాగ్ రాజౌరి స్థానానికి మే 25న పోలింగ్ జరగనుంది. గతంలో మే 7న ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉండగా కొన్ని పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం ఇక్కడ ఓటింగ్ తేదీని మార్చింది. మే 13న శ్రీనగర్‌లో నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. బారాముల్లా లోక్‌సభ స్థానానికి మే 20వ తేదీన పోలింగ్ జరగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…