AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రత్యేక రైలులో ఫుడ్ పాయిజన్ కలకలం.. 40 మంది ప్రయాణికుల అస్వస్థత

ప్రత్యేక రైలులో వెళ్తున్న ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. భారతీయ రైల్వేలో లభించే ఆహారంపై అనేకసార్లు ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. మరోసారి రైల్వే క్యాంటిన్ నిర్వహకుల నిర్లక్ష్యం బయటపడింది. తాజాగా చెన్నై నుంచి గుజరాత్ వెళ్తున్న ప్రత్యేక రైలులో ఫుడ్ పాయిజన్ కావడంతో 40 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో దాదాపు గంట సేపు రైలును నిలిపివేసి చికిత్స అనంతరం గమ్యస్థానానికి పంపించారు.

Indian Railways: ప్రత్యేక రైలులో ఫుడ్ పాయిజన్ కలకలం.. 40 మంది ప్రయాణికుల అస్వస్థత
Bharat Gaurav Train
Balaraju Goud
|

Updated on: Nov 29, 2023 | 5:51 PM

Share

ప్రత్యేక రైలులో వెళ్తున్న ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. భారతీయ రైల్వేలో లభించే ఆహారంపై అనేకసార్లు ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. మరోసారి రైల్వే క్యాంటిన్ నిర్వహకుల నిర్లక్ష్యం బయటపడింది. తాజాగా చెన్నై నుంచి గుజరాత్ వెళ్తున్న ప్రత్యేక రైలులో ఫుడ్ పాయిజన్ కావడంతో 40 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో దాదాపు గంట సేపు రైలును నిలిపివేసి చికిత్స అనంతరం గమ్యస్థానానికి పంపించారు.

బుధవారం నవంబర్ 29న షోలాపూర్ – పూణే మధ్య ఒక కోచ్‌లో సుమారు 40 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. వికారం, విరేచనాలు, వాంతులు, తలనొప్పితో ఫిర్యాదు చేసినట్లు రైల్వే అధికారి తెలిపారు. దీంతో పూణే స్టేషన్‌లో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వైద్యుల బృందం ప్రయాణికులందరినీ జాగ్రత్తగా పరిశీలించి, చికిత్స అందించిందని చెప్పారు. దాదాపు 50 నిమిషాల తర్వాత రైలును గమ్యస్థానానికి బయలుదేరింది. ప్రస్తుతం ప్రయాణికులందరి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక రైలు చెన్నై నుంచి గుజరాత్‌కు వెళ్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో నవంబర్ 29న రైలును పూణే స్టేషన్‌లో ఆపాల్సి వచ్చిందన్నారు. గుజరాత్‌లోని పాలిటానాలో జరిగే మతపరమైన కార్యక్రమం కోసం భారత్ గౌరవ్ రైలును ప్రత్యేకంగా బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, ఒక ప్రైవేట్ సంస్థ క్యాటరింగ్ సేవలను నడుపుతోంది. కంపెనీపై మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆహారాన్ని రైల్వే ప్యాసింజర్ గ్రూప్ ప్రైవేట్‌గా కొనుగోలు చేసిందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? బయట పడ్డ నమ్మలేని నిజాలు
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? బయట పడ్డ నమ్మలేని నిజాలు
బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?
బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?
తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌
తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌