AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheetah Project: చిరుత ప్రాజెక్ట్ కు కండిషన్స్ అప్లై అంటోన్న నమిబియా.. భారత్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి..

1980 నుండి భారత దేశంలో ఏనుగు దంతాల వ్యాపారంపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నమీబియా కోరిన విధంగా భారత్ మద్దతు ఇస్తే అది మన దేశం తీసుకునే సంచలన నిర్ణయం కానుంది

Cheetah Project: చిరుత ప్రాజెక్ట్ కు కండిషన్స్ అప్లై అంటోన్న నమిబియా.. భారత్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి..
Cheetah Project
Surya Kala
|

Updated on: Oct 13, 2022 | 10:12 AM

Share

నమీబియాతో చిరుత ప్రాజెక్ట్ లో భాగంగా ద్వైపాక్షిక సహకారం..  ఈ రంగంలో పురోగతికి మద్దతు ఇవ్వాలని భారతదేశం అంగీకరించింది. ఇలా మద్దతు ఇవ్వడం వలన “జీవవైవిధ్యం నిర్వహణ, స్థిరమైన ఉపయోగం.. ప్రోత్సహం లభిస్తుందని భారతదేశం భావిస్తోంది.    కార్పొరేషన్‌లో అంతర్జాతీయ వాణిజ్యం ( CITES )కార్యాలయం వద్ద వృక్షజాలం, జంతుజాలంపై జరిగిన సమావేశంలో నమీబియా,  భారతదేశం సంయుక్తంగా దీనికి మద్దతు ఇస్తాయి. ‘ఐవరీ’ అనే పదాన్ని నేరుగా ఉపయోగించకుండా..  CITESలో ‘సుస్థిర నిర్వహణ’కు మద్దతు ఇవ్వాలని నమీబియా భారతదేశాన్ని కోరింది. ఇది నమీబియాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనను అనుమతి లభిస్తుంది. నమీబియా, బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలలో లభించే ఏనుగు దంతాల వ్యాపారానికి మద్దతు ఇవ్వడానికి ఈ ప్రతిపాదన ద్వారా అనుమతిని కోరింది.

1980 నుండి భారత దేశంలో ఏనుగు దంతాల వ్యాపారంపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నమీబియా కోరిన విధంగా భారత్ మద్దతు ఇస్తే అది మన దేశం తీసుకునే సంచలన నిర్ణయం కానుంది. ఈ మేరకు నవంబర్‌లో జరిగే సమావేశంలో మళ్లీ ఓటింగ్‌కు పెట్టనున్నారు. ఈ సమావేశం వచ్చే నెలలో పనామాలో 19వ CITES సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఏనుగు దంతాల నిషేధాన్ని ఎత్తివేసే విషయంలో CITES మేనేజ్‌మెంట్ అథారిటీ SP యాదవ్ భారతదేశం తరపున పాల్గొననున్నారు. ‘తాము ఇప్పటికీ భారతదేశం స్టాండ్‌పై పని చేస్తున్నాము’ అని అన్నారు.

భారత్ మద్దతు కోరిన నమీబియా: ఏనుగు దంతాల వ్యాపారం విషయంలో నమీబియా  వైఖరి స్పష్టంగా ఉంది. నమీబియా పర్యావరణ మంత్రిత్వ శాఖ PRO రోమియో ముయుండా  మీడియాతో మాట్లాడుతూ.. నమీబియా, ఇతర ప్రాంతీయ దేశాలు ఏనుగు దంతాల వ్యాపారం చేయడానికి అనుమతి పొందితే చాలా బాగుంటుందని అన్నారు. ఈ మేరకు తాము భారత్‌కు మద్దతు ఇవ్వాలని కోరామని చెప్పారు. ఇప్పటికే మా ఆలోచనకు  మరో దేశం కూడా మాకు మద్దతిస్తోందని తెలిపారు. ఇది తమ విజయావకాశాలను పెంచుతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రాజెక్టులో ఏనుగులే కీలకం: భారతదేశం తరపున.. పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చిరుత ప్రాజెక్ట్ కింద ‘వన్యప్రాణుల సంరక్షణ, స్థిరమైన జీవవైవిధ్య వినియోగం’పై నమీబియా డిప్యూటీ PM నెటుంబో నంది నదీత్వాతో సంతకం చేశారు. యాదవ్ దీనిని చారిత్రాత్మకంగా అభివర్ణించారు. అయితే, ఈ ఒప్పందాన్ని ఇరు దేశాల ప్రభుత్వం ఇంకా బహిరంగపరచలేదు. ఈ ఒప్పందం మధ్యలో ఏనుగులు కీలకంగా మారాయని చిరుత ప్రాజెక్టు అధికారి ఒకరు తెలిపారు. డ్రాఫ్టింగ్‌ విషయంలో సమయం ఇవ్వబడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..