AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lottery Winner: లాటరీలో గెలిచిన పాతిక కోట్లు తనకొద్దు అంటున్న విజేత.. రీజన్ ఇదే

రూ. 25 కోట్ల మొదటి బహుమతి విజేతగా ప్రకటించిన ఐదు రోజుల తర్వాత.. ఆటోరిక్షా డ్రైవర్ అనూప్ తాను బహుమతి ప్రకటించిన రెండు రోజులు చాలా సంతోష పడ్డానని.. అయితే  ఇప్పుడు తాను ఎంతో చింతిస్తున్నట్లు చెప్పాడు. దీనికి రీజన్ తెలిస్తే షాక్ తింటారు. 

Lottery Winner:  లాటరీలో గెలిచిన పాతిక కోట్లు తనకొద్దు అంటున్న విజేత.. రీజన్ ఇదే
Kerala Lottery Winner
Surya Kala
|

Updated on: Sep 24, 2022 | 9:15 PM

Share

Lottery Winner: డబ్బులు ఉన్నవారు వాటిని కాపాడుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తూ.. మనశాంతిని కూడా కోల్పోతారని.. తన ఆస్తులను, అంతస్తులను కాపాడుకోవడానికి కనీసం నిద్ర కూడా పోరని.. అదే పేదవారికి అయితే డబ్బులు ఎక్కడ దాచాలి.. ఎలా ఖర్చు చేయాలనే బాధలు ఉండవు కనుక.. హ్యాపీగా గడిపేస్తాడు అంటూ కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. అయితే ఒకొక్కసారి ఇటువంటివి నిజమేమో అనిపిస్తుంటాయి. తాజాగా కేరళలోని లాటరీని గెలిచిన ఓ అదృష్టశాలి పరిస్థితి. కేరళ ప్రముఖ పండగ ఓనం సందర్భంగా ఓ ఆటో డ్రైవర్ వార్త‌ల్లో నిలిచాడు. అతడి పేరు.. సర్వత్రా వినిపిస్తోంది. ఇటీవల కేర‌ళ ప్రభుత్వం నిర్వ‌హించిన మెగా ఓనం రాఫిల్‌లో రూ. 25 కోట్ల బహుమతిని పొందిన భాగ్యశాలి అంటూ ప్రశంసల వర్షం కురిపించింది.  రూ. 25 కోట్ల మొదటి బహుమతి విజేతగా ప్రకటించిన ఐదు రోజుల తర్వాత.. ఆటోరిక్షా డ్రైవర్ అనూప్ తాను బహుమతి ప్రకటించిన రెండు రోజులు చాలా సంతోష పడ్డానని.. అయితే  ఇప్పుడు తాను ఎంతో చింతిస్తున్నట్లు చెప్పాడు. దీనికి రీజన్ తెలిస్తే షాక్ తింటారు.

ఆటో డ్రైవ‌ర్ అనూప్  25 కోట్ల రూపాయలను గెలుచుకున్నా.. ప‌న్ను, ఇతర బకాయిలు అన్ని మిన‌హాయింపులు తర్వాత ప్రైజ్ మనీగా రూ. 15 కోట్లు పొందుతాడు. అయితే ఇంత భారీ మొత్తంలో డబ్బులు రానుండడంతో తాను ఇప్పుడు మ‌న‌శ్శాంతిని కోల్పొయాన‌ని చెపుతున్నాడు. కనీసం తన ఇంట్లో తాను నివసించే పరిస్థితి లేదని వాపోతున్నాడు. ఎందుకంటే నేను మొదటి బహుమతిని గెలుచున్న తర్వాత తన దగ్గరకు తమ అవసరాలను తీర్చమంటూ కోరుతున్న వారి సంఖ్య అధికం అయింది. మొదట్లో తనకు బహుమతి వచ్చినందుకు సంతోషంగానే ఉంది.. అయితే ఇప్పుడు తనకు బహుమతి వద్దనిపిస్తుందని అన్నాడు. అంతకు ముందు ఉన్న మనశ్శాంతి అంతా కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

కాగా తనకు ఇంకా డబ్బులు అందలేదని సోషల్ మీడియా ద్వారా అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.  ప్రస్తుతం తాను డబ్బులను ఏమి చెయ్యాలో నిర్ణయించుకోలేదని.. రెండు ఏళ్ళు బ్యాంక్ లో వేస్తానని చెబుతున్నాడు. అంతేకాదు.. తనకొక కనీస అవసరాలు తీరే విధంగా తక్కువ మొత్తంలో డబ్బులు వచ్చినా బాగుండేదని, ప్రశాంతంగా ఉండేవాడినని అంటున్నాడు అనూప్. ఎందుకంటే డబ్భులు వచ్చాయని తెలియగానే తనకు తెలిసిన వారు చాలా మంది శత్రువులుగా మారే దశ ఇప్పుడు వచ్చిందని అనూప్ వాపోయాడు.

ఇవి కూడా చదవండి

ఆటో డ్రైవ‌ర్ అనూప్ తన భార్య, బిడ్డ తల్లితో కలిసి కేరళ రాజధానికి 12 కిలోమీటర్ల దూరంలోని శ్రీకారియమ్‌లో నివసిస్తున్నాడు. అనూప్డ స్థానిక ఏజెంట్ నుండి లాటరీ టికెట్ ను కొనుగోలు చేశాడు. ఇటీవల ఆ లాటరీ టికెట్ కు మొదటి బహుమతి లభించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి