India Corona: దేశంలో భయపెడుతున్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు..మరణాలు

India Corona Updates: దేశంలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం...

India Corona: దేశంలో భయపెడుతున్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు..మరణాలు
India Corona
Follow us

|

Updated on: May 08, 2021 | 12:01 PM

India Corona Updates: దేశంలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా కూడా 4 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు దాటేశాయి. గడిచిన 24 గంటల్లో 18,26,490 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 4,01,078 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2.18 కోట్లకు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 4187 మంది కరోనాతో మృతి చెందగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 2,38,270కి చేరుకుంది. ఇక దేశంలో మరణాల రేటు 1.09 శాతం ఉంది.

ఇక కొత్త కేసులతో పాటు రికవరీ కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,18,609 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రివకరీల సంఖ్య 1.79కోట్లకు చేరగా, రివకరీ రేటు 81.95 శాతం ఉంది. ఇక క్రియాశిల కేసులు 37 లక్షలు దాటగా, ప్రస్తుతం 37,23,446 మంది చికిత్స పొందుతున్నారు. ఇక క్రియాశీల రేటు 16.96గా ఉంది. శుక్రవారం ఒక్క రోజు దేశంలో 22,97,257 మందికి కరోనా టీకాలు వేయగా, ఇప్పటి వరకు 16.73 కోట్ల మందికి కరోనా టీకా వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇవీ కూడా చదవండి:

Corona in Telangana: తెలంగాణ‌లోని ఆ గ్రామంలో సెంచరీ పాజిటివ్‌ కేసులు.. వణికిపోతున్న గ్రామ‌స్థులు

విమానాశ్రయంలో రూ.100 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్‌.. డ్రగ్‌ వాసన రాకుండా ఏం చేశారంటే..

Income Tax: బ్యాంకు లావాదేవీలు జరుపుతున్నారా..? అయితే జాగ్రత్త.. ఐటీ నోటీసులు వచ్చే 5 రకాల లావాదేవీలు ఇవే..!

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త