AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gyanvapi case: జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. శివలింగాకృతిని పరిరక్షించాలని ఆదేశం..

జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మసీదులోని శివలింగాకృతిని పరిరక్షించాలంటూ..

Gyanvapi case: జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. శివలింగాకృతిని పరిరక్షించాలని ఆదేశం..
Gyanvapi Case
Shiva Prajapati
|

Updated on: Nov 11, 2022 | 5:43 PM

Share

జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మసీదులోని శివలింగాకృతిని పరిరక్షించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. ప్రసిద్ద పుణ్యక్షేత్రం వారణాసిలోని జ్ఞానవాపి మసీదు గోడకు ఉన్న గౌరి, గణేశ్, హనుమాన్, నంది విగ్రహాలకు రోజూ పూజలు చేసుకునేందుకు అనుమతించాలని కొద్ది నెలల కిందట కోర్టులో కొంతమంది మహిళలు పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌తో దేశమంతా కలకలం రేగింది. మహిళల పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. అక్కడి దృశ్యాల సర్వేకు ఆదేశించింది. ఈ సర్వేలో ఒక శివలింగం ఆకారం బయటపడింది. అయితే, ఇది శివలింగం అని అంగీకరించడానికి మసీదు నిర్వాహకులు ఒప్పుకోలేదు. ఈ అంశం సున్నితమైందంటూ, ఈ ప్రాంతాన్ని సీజ్‌ చేస్తూ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత మసీదు నిర్వాహకులు, హిందువులు వేసిన పిటిషన్లపై పలుసార్లు విచారణలు జరిగాయి. చివరకు 12 పేజీల సర్వే రిపోర్ట్‌ తర్వాత.. అక్టోబర్ 14న శివలింగాన్ని సురక్షితంగా పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీం ఆదేశానుసారం.. కార్బన్ డేటింగ్‌కు అనుమతించేది లేదని వారణాసి జిల్లా కోర్టు కూడా స్పష్టం చేసింది. అదే సమయంలో మసీదులో విగ్రహాలను పూజించుకోవడానికి అనుమతించాలన్న హిందువుల పిటిషన్ పై విచారణను కూడా చేపట్టింది. దీన్ని సవాల్‌ చేస్తూ.. మసీదు కమిటీ అంజుమన్‌ ఇంతెజా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో..శివలింగం కార్బన్ డేటింగ్ పిటిషన్ విచారణకు హైకోర్టు అంగీకరించింది. మరోవైపు, వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేసిన నలుగురు హిందూ మహిళలు.. శివలింగంపై కార్బన్ డేటింగ్ జరపాలని రివిజన్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. ఈ కేసులో స్పందించాలని మసీదు నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతెజియా కమిటీకి నోటీసులు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణ ఈనెల 22న జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..