AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయివేటు రంగంలో ఏడాది అనుభవం మస్ట్.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇక కొత్త అభ్యర్థులను నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలకు తీసుకోబోమని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ..

ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయివేటు రంగంలో ఏడాది అనుభవం మస్ట్.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Goa Cm Pramod Sawant
Amarnadh Daneti
|

Updated on: Nov 09, 2022 | 12:57 PM

Share

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇక కొత్త అభ్యర్థులను నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలకు తీసుకోబోమని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు ఒక ఏడాది పని అనుభవం తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించారు. ఉత్తర గోవా జిల్లాలోని తలీగావో గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా రిక్రూట్‌మెంట్‌ను తప్పనిసరి చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏడాది పని అనుభవం తప్పనిసరి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత ముందు ప్రైవేట్ రంగంలో పని చేసిన అనుభవం పొందాలని అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసేలా రిక్రూట్‌మెంట్ రూల్స్‌లో అవసరమైన సవరణలు చేయనున్నట్లు గోవా సీఏం తెలిపారు. నైపుణ్యం కలిగిన మానవవనరుల ఎంపిక కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవాలని, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరగకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు ఉద్యోగాలు ఇచ్చే వారు కాదని, ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

గోవాలో గత ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా యువతను ఆకర్షించేందుకు అనేక హామీలను గుప్పించింది. అయితే యువత మాత్రం బీజేపీ వైపు మొగ్గుచూపారు. దీంతో ప్రమోద్ సావంత్ మరోసారి సీఏం అయ్యారు. తాజాగా గోవా ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకు కొంత నిరాశ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గోవా సీఏం ప్రమోద్ సావంత్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. చదువు పూర్తైన తర్వాత ఎటువంటి అనుభవం లేకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే భావనలో చాలా మంది ఉన్నారని, అందుకే ప్రయివేట్ రంగంలో అనుభవం తప్పనిసరి చేశామని, దీని ద్వారా బాధ్యతలు తెలుస్తాయని, ప్రభుత్వ ఉద్యోగాన్ని మరింత బాధ్యతతో నిర్వర్తించే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

Follow Us
సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చెక్కు చెదరని క్రేజ్.. ఈ పాట వేరేలెవల్..
సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చెక్కు చెదరని క్రేజ్.. ఈ పాట వేరేలెవల్..
ఇలా చేస్తే ఎంతటి భయంకరమైన నరదిష్టి అయినా..
ఇలా చేస్తే ఎంతటి భయంకరమైన నరదిష్టి అయినా..
అబ్బాయిలూ.. ఈ విషయం తెలిస్తే జన్మలో జీన్స్ వేసుకోరు.. !
అబ్బాయిలూ.. ఈ విషయం తెలిస్తే జన్మలో జీన్స్ వేసుకోరు.. !
వితికా చెల్లి కొడుకు నామకరణం వేడుక.. ఏం పేరు పెట్టారంటే?
వితికా చెల్లి కొడుకు నామకరణం వేడుక.. ఏం పేరు పెట్టారంటే?
దేశ ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం.. బొగ్గు గ్యాసిఫికేషన్..
దేశ ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం.. బొగ్గు గ్యాసిఫికేషన్..
దోమలు కాదు ప్రాణాలు పోతాయ్.. వీటిని ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే
దోమలు కాదు ప్రాణాలు పోతాయ్.. వీటిని ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే
నమ్మరేమోగానీ, నల్లేరా మజాకా.. ఎముకలకు వజ్రం లాంటి బలం!
నమ్మరేమోగానీ, నల్లేరా మజాకా.. ఎముకలకు వజ్రం లాంటి బలం!
గ్యాస్ కొరతపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
గ్యాస్ కొరతపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి
ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి
మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే
మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే