- Telugu News Photo Gallery Political photos PM Modi to inaugurate Terminal 2 of Kempegowda International Airport in bangalore on 11 November
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లో ‘వాక్ ఇన్ ది గార్డెన్’ టెర్మినల్ 2 ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11న బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 5000 కోట్లు టెర్మినల్ నిర్మించారు.
Updated on: Nov 09, 2022 | 11:52 AM

ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11న బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 5000 కోట్లు టెర్మినల్ నిర్మించారు.

T2 ప్రారంభోత్సవంతో, ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యంతో పాటు చెక్-ఇన్, ఇమ్మిగ్రేషన్ కోసం కౌంటర్లు రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఇది ప్రజలకు ఎంతో సహాయపడుతుంది.

దాదాపు రూ.5,000 కోట్ల వ్యయంతో నిర్మించబడిన టెర్మినల్ 2 ప్రస్తుతం ఏటా 2.5 కోట్ల సామర్థ్యంతో దాదాపు 5-6 కోట్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదు.

టెర్మినల్ 2 బెంగుళూరు ఉద్యానవనం నగరానికి నివాళిగా రూపొందించబడింది.

స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి భారతదేశంలో తయారు చేయబడిన 10,000 చదరపు మీటర్ల పచ్చని గోడలు, వేలాడే తోటలు, అవుట్డోర్ గార్డెన్ల గుండా ప్రయాణీకులు నడవడానికి వీలుంటుంది.

ఈ విమానాశ్రయం ఇప్పటికే క్యాంపస్లో 100 శాతం పునరుత్పాదక ఇంధన వినియోగంతో సుస్థిరతలో బెంచ్మార్క్ని నెలకొల్పింది.

విమానాశ్రయం ఆవరణలో బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపేగౌడ విగ్రహాన్ని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.




