AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Charges: యూపీఐ ఛార్జీలు వ్యాపారులకు మాత్రమే.. వినియోగదారులకు కాదు.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి

UPI Charges: యూపీఐ, రూపేల ఛార్జీ-రహిత నమూనాను విమర్శించిన యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) 2026 నివేదిక తర్వాత ఈ సవరణను తీసుకువచ్చారని జైరామ్ రమేష్ ఆరోపించారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం డిజిటల్ చెల్లింపుల రంగాన్ని విదేశీ కంపెనీలకు తెరవాలని చూస్తోందా..

UPI Charges: యూపీఐ ఛార్జీలు వ్యాపారులకు మాత్రమే.. వినియోగదారులకు కాదు.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి
Upi Charges
Subhash Goud
|

Updated on: Aug 07, 2026 | 10:44 AM

Share

UPI Charges: దేశంలో అతిపెద్ద డిజిటల్ చెల్లింపు మాధ్యమంగా మారిన యూపీఐపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వివాదం నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (FM) మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరోపణలకు ఆర్థిక మంత్రి స్పందించారు. MDR భారం కేవలం వ్యాపారిపై మాత్రమే పడుతుందని, సాధారణ వినియోగదారుడిపై కాదని ఆయన అన్నారు. ఇది బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు మెరుగైన మౌలిక సదుపాయాలు, కొత్త సాంకేతికత, భద్రతా వ్యవస్థలలో పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుంది. ఇది అంతిమంగా UPI వినియోగదారులందరికీ ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. భవిష్యత్తులో UPI లావాదేవీలపై MDR విధించడానికి పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు, 2026 మార్గం సుగమం చేయవచ్చని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఆరోపించిన దానికి ప్రతిస్పందనగా ఆర్థిక మంత్రి ఈ ప్రకటన చేశారు.

MDRను అమలు చేయాలా వద్దా అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయాన్ని NPCI నేతృత్వంలోని యూపీఐ, సేవల స్టీరింగ్ కమిటీ తీసుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10Aను సవరించాలని ప్రతిపాదించే టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (సవరణ) బిల్లు, 2026ను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని, పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా చర్చలో పాల్గొని ఉంటే, ఈ అంశాలన్నింటిపై లోక్‌సభ, రాజ్యసభలలో సవివరంగా చర్చ జరిగి ఉండేదని ఆర్థిక మంత్రి అన్నారు.

కాంగ్రెస్ ఏ ఆరోపణలు చేసింది?

ఇంతకుముందు కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ‘X’లో పోస్ట్ చేస్తూ, కొత్త సవరణ బిల్లు యూపీఐ లావాదేవీలను ఛార్జీలు లేకుండా ఉంచే ప్రస్తుత చట్టపరమైన వ్యవస్థను తొలగించి, భవిష్యత్తులో యూపీఐతో సహా ఇతర డిజిటల్ చెల్లింపులపై MDR విధించడానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు. దీని అంతిమ భారం సామాన్య ప్రజలపై పడుతుందని, భవిష్యత్తులో యూపీఐ వినియోగంపై కూడా రుసుములు విధించవచ్చని ఆయన వాదించారు.

ఇది కూడా చదవండి: Income Tax: ఆగస్టు 31లోగా ITR ఎవరు దాఖలు చేయాలి? వారికి అక్టోబర్‌ 31 గడువు..!

ఆర్‌బిఐ వద్ద తగినంత వనరులు ఉన్నందున, యూపీఐ వ్యవస్థను నడపడానికి ఎం.డి.ఆర్ అవసరం లేదని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. 2025-26లో ఆర్‌బిఐ కేంద్ర ప్రభుత్వానికి రూ. 2.86 లక్షల కోట్ల మిగులు నిధులను బదిలీ చేసిందని, అందులో ఒక చిన్న భాగం యూపీఐ వంటి డిజిటల్ ప్రజా వ్యవస్థను నిర్వహించడానికి సరిపోతుందని ఆయన వాదించారు.

Merchant Discount Rate

Merchant Discount Rate

అంతేకాకుండా, యూపీఐ, రూపేల ఛార్జీ-రహిత నమూనాను విమర్శించిన యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) 2026 నివేదిక తర్వాత ఈ సవరణను తీసుకువచ్చారని జైరామ్ రమేష్ ఆరోపించారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం డిజిటల్ చెల్లింపుల రంగాన్ని విదేశీ కంపెనీలకు తెరవాలని చూస్తోందా అని ఆయన ప్రశ్నించారు. అయితే, ఈ ఆరోపణలకు ప్రతిస్పందనగా, MDR అమలుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నిర్దేశిత ప్రక్రియ ద్వారా తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us