బిగ్‌ అలర్ట్‌.. ఇప్పుడు ఇలా చేయకపోతే మీ ఇంటికి సిలిండర్‌ రాదు

September 20, 2026

Subhash

వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026 అక్టోబర్ 1 నుంచి సబ్సిడీతో కూడిన గృహ LPG రీఫిల్‌లకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కానుంది.

వంటగ్యాస్

సబ్సిడీ ప్రయోజనం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరేలా చూడటం, నకిలీ, డూప్లికేట్, అనర్హమైన కనెక్షన్లను తొలగించడం ఈ నిర్ణయం లక్ష్యం.

సబ్సిడీ ప్రయోజనం

సెప్టెంబర్ 19 నాటికి 27.43 కోట్ల క్రియాశీల దేశీయ LPG వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ పూర్తి చేశారు. ఇది మొత్తం వినియోగదారుల్లో 89.9 శాతం. 

వెరిఫికేషన్

ఇంకా బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ పూర్తి చేయని వారు అక్టోబర్ 1 నుంచి సబ్సిడీ ధరకు LPG రీఫిల్ బుక్ చేసుకునే ముందు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. తర్వాతే సబ్సిడీ రీఫిల్ బుకింగ్‌కు అర్హత.

వెరిఫికేషన్ 

బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ కోసం గ్యాస్ ఏజెన్సీకి తప్పనిసరిగా వెళ్లాల్సిన అవసరం లేదు. సిలిండర్ డెలివరీ సమయంలోనే డెలివరీ సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. 

డెలివరీ

మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ చేసుకునే అవకాశం కూడా ఉంది.IndianOil ONE, HelloBPCL, HP PAY. దీనికి ఎలాంటి రుసుము లేదు.

ఇంట్లో వెరిఫికేషన్

బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ చేయని లేదా చేయలేనివారు గ్యాస్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోదు. అయితే సబ్సిడీ ధర వర్తించదు. వారు మార్కెట్ ధరకు LPG రీఫిల్ పొందాల్సి ఉంటుంది. 

వెరిఫికేషన్

అక్టోబర్ 1 నుంచి సబ్సిడీ ధరకు LPG రీఫిల్ పొందాలనుకునే అర్హులైన వినియోగదారులు తమ బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ పూర్తయిందో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలి. 

సబ్సిడీ