AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మా మఠంలో మోదీ పొలిటికల్ స్పీచ్.. అత్యంత బాధాకరం’

కోల్ కతాలోని  రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయమైన బేలూరు మఠంలో ప్రధాని మోదీ చేసిన ‘రాజకీయ ప్రసంగం’  పట్ల మఠం సభ్యులు తీవ్ర ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. (ఆదివారం ఈ మఠంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. సవరించిన పౌరసత్వ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే.. ఈ చట్టం పౌరసత్వాన్ని ఇచ్చేందుకే తప్ప..లాక్కోవడానికి కాదు అని కూడా ఆయన అన్నారు). అయితే ఏ రాజకీయ పార్టీకీ నెలవు కాని, సంబంధం […]

'మా మఠంలో మోదీ పొలిటికల్ స్పీచ్.. అత్యంత బాధాకరం'
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 13, 2020 | 5:26 PM

Share

కోల్ కతాలోని  రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయమైన బేలూరు మఠంలో ప్రధాని మోదీ చేసిన ‘రాజకీయ ప్రసంగం’  పట్ల మఠం సభ్యులు తీవ్ర ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. (ఆదివారం ఈ మఠంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. సవరించిన పౌరసత్వ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే.. ఈ చట్టం పౌరసత్వాన్ని ఇచ్చేందుకే తప్ప..లాక్కోవడానికి కాదు అని కూడా ఆయన అన్నారు). అయితే ఏ రాజకీయ పార్టీకీ నెలవు కాని, సంబంధం లేని తమ మఠంలో ఆయన రాజకీయ ప్రసంగం చేయడంలో ఔచిత్యం లేదని,  తామెంతో మనస్తాపం చెందుతున్నామని ఈ మఠం సభ్యుడు గౌతమ్ రాయ్,  ప్రధాన కార్యదర్శి స్వామి సువిరానంద తెలిపారు. ‘ ఇది రాజకీయ వేదిక కాదు.. ఆ విధమైన ప్రకటనలు చేయడానికి ప్రధానికి ఇక్కడ అనుమతి లేదు ‘ అని పేర్కొన్న గౌతమ్ రాయ్.. గత కొన్నేళ్లుగా తమ కార్యాలయం పొలిటికల్ ప్లాట్ ఫామ్ గా మారిపోయిందని విమర్శించారు. గతంలో ఆర్ఎస్ఎస్ తో సంబంధమున్న సీనియర్ ఆధ్యాత్మిక నాయకులు ఈ సంస్థతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. మోదీ విజిట్ ఈ ‘ గ్రోయింగ్ ట్రెండ్ ‘ లో భాగమే అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

‘ మేము మా ఇళ్లను, కుటుంబాలను వదిలి మోక్షం ఆశించి.. నిష్కల్మషమైన ఈ చోటికి వచ్చాం.. అనుచితమైన పిలుపులు, ప్రసంగాలను అనుమతించబోమని ‘ స్వామి సువిరానంద స్పష్టం చేశారు. ఇక్కడ హిందూ, ఇస్లామ్, క్రైస్తవ మతాలకు చెందిన సాధువులు ఉన్నారని, తామంతా ఒకే తలిదండ్రులకు జన్మించిన సోదరుల్లా ఉంటున్నామని ఆయన చెప్పారు. మోదీ ఈ దేశ ప్రధాని, మమతా బెనర్జీ ఈ రాష్ట్ర నేత.. అంతే అని ఆయన పేర్కొన్నారు.