AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Herald Case: రాహుల్ విచారణపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు, ఈడీ ఆఫీసుల ముట్టడి..

రాహుల్‌గాంధీని కావాలనే టార్గెట్ చేశారని ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా ఆరోపించారు. ప్రధాని మోదీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

National Herald Case: రాహుల్ విచారణపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు, ఈడీ ఆఫీసుల ముట్టడి..
National Herald Case Rahul Gandhi
Venkata Chari
|

Updated on: Jun 13, 2022 | 9:16 PM

Share

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌గాంధీ(Rahul Gandhi)ని ఈడీ(ED) విచారించడంపై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌(Congress) కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అన్ని రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాలను ముట్టడించారు. ఉదయం 3 గంటల పాటు విచారించిన ఈడీ.. లంచ్‌ బ్రేక్‌ తరువాత ప్రశ్నల పరంపర కొనసాగించింది. ది. యంగ్‌ ఇండియా బ్యాంక్‌ ఖాతాల పైనే ప్రధానంగా రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కొన్ని షెల్‌ కంపెనీల నుంచి ఈ ఖాతాలకు డబ్బులు వచ్చినట్టు అనుమానిస్తున్నారు. రాహుల్‌ ఈడీ విచారణ సందర్భంగా.. ఢిల్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. రాహుల్‌తో పాటు ఈడీ కార్యాలయానికి ర్యాలీకి బయలుదేరిన పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను పోలీసులు ఈడ్చుకెళ్లారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కూడా తోపులాటలో గాయపడ్డారు.

రాహుల్‌గాంధీని కావాలనే టార్గెట్ చేశారని ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా ఆరోపించారు. ప్రధాని మోదీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. అవినీతికి మద్దతుగా ఆయన పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థపై ఒత్తిడి చేయడానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల నుంచి ఢిల్లీకి అగ్రనేతలు వచ్చారని ఆరోపించారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఢిల్లీ తుగ్లక్‌ రోడ్‌ పోలీసుస్టేషన్‌ చేరుకున్నారు. అరెస్టైన కాంగ్రెస్‌ నేతలను, కార్యకర్తలను ఆమె పరామర్శించారు. ఈడీ విచారణకు రాహుల్‌తో పాటు బయలుదేరిన కాంగ్రెస్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. తుగ్లక్‌రోడ్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కేసీ వేణుగోపాల్‌ను కూడా ప్రియాంక పరామర్శించారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు చాలా అనుచితంగా ప్రవర్తించారని కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసుల తోసేయడంతో తనకు గాయమైనట్టు బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరి ఆరోపించారు. ఉన్నతాధికారులకు ఈ వ్యవహారంపై ఆయన ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ కార్యదర్శ సంపత్‌కుమార్‌కు కూడా తోపులాటలో గాయాలయ్యాయి.

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌