AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: బైక్ పేపర్లు లేవంటూ చలాన్.. కోపంతో లైన్‌మెన్ చేసిన పనికి బిత్తరపోయిన పోలీసులు..

ఈ ఆసక్తికరమైన కేసు సిరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్దాస్‌పూర్ పోలీస్ పోస్ట్‌కి చెందినది. అవుట్‌పోస్టు ఇన్‌చార్జి వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో..

Viral News: బైక్ పేపర్లు లేవంటూ చలాన్.. కోపంతో లైన్‌మెన్ చేసిన పనికి బిత్తరపోయిన పోలీసులు..
Representative image
Venkata Chari
|

Updated on: Jun 12, 2022 | 1:29 PM

Share

యూపీలోని బరేలీలో ఓ విచిత్రమైన ప్రతీకార కేసు తెరపైకి వచ్చింది. ఓ ఇన్‌స్పెక్టర్ విద్యుత్ శాఖకు చెందిన లైన్‌మెన్ బైక్‌కు చలాన్ విధించాడు. దాంతో ఆగ్రహించిన లైన్‌మెన్ పోలీస్ పోస్ట్‌లోని కరెంటును కట్ చేశాడు. కరెంటు లేకపోవడంతో పోలీసులు చీకట్లో గడపాల్సి వచ్చింది. ఈ ఆసక్తికరమైన కేసు సిరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్దాస్‌పూర్ పోలీస్ పోస్ట్‌కి చెందినది. అవుట్‌పోస్టు ఇన్‌చార్జి వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. ఇంతలో బార్సర్ సబ్ స్టేషన్ లైన్ మెన్ భగవాన్ స్వరూప్ అలియాస్ పింకీ బైక్ పై వస్తున్నాడు. సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్ మోడీ సింగ్ లైన్‌మెన్‌ను ఆపి బైక్ పేపర్లు చూపించమని అడిగాడు.

లైన్‌మెన్ పోలీసుతో, “సార్, ఈ సమయంలో మోటారుసైకిల్ పేపర్లు లేవు. ఇంటి నుంచి తెచ్చి చూపిస్తాను’ అంటూ పేర్కొన్నాడు. కానీ, ఇన్‌స్పెక్టర్ మోదీ సింగ్ అంగీకరించకపోవడంతో పింకీ బైక్‌కు చలాన్ విధించాడు. దీంతో కోపోద్రిక్తుడైన లైన్‌మెన్ పింకీ విద్యుత్ శాఖలోని ఇతర ఉద్యోగులను పిలిపించి పోలీసు పోస్టు కరెంటు కట్ చేశాడు.

ఆ తర్వాత పోలీసులు లైన్‌మెన్‌ను వేడుకోవడం మొదలుపెట్టారు. కానీ అతను పోస్ట్‌కు విద్యుత్ కనెక్షన్‌ మాత్రం ఇవ్వలేదు. లైన్‌మెన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్‌ పోస్టులో విద్యుత్‌ కనెక్షన్‌ లేదు. ఔట్‌పోస్టు వద్ద అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. అదే సమయంలో సరైన విద్యుత్ కనెక్షన్ లేకపోవడంపై పోలీసులను ప్రశ్నించగా.. దీనిపై ఎలాంటి సమాధానం చెప్పలేదంటూ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరోవైపు, సిరౌలి పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ మోడీ సింగ్ ప్రకారం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెల్మెట్, పేపర్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని తనిఖీలు చేస్తున్నారు. లైన్‌మెన్ పింకీ వద్ద బైక్ పేపర్లు లేకపోవడంతో అతని చలాన్ విధించామంటూ చెప్పుకొచ్చాడు.

అదే సమయంలో బరేలీ డివిజన్ విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ సంజయ్ జైన్ మాట్లాడుతూ.. పోలీస్ చెక్‌పోస్టు విద్యుత్‌ను డిస్‌కనెక్ట్ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరుపుతామని తెలిపాడు. ఆ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.