Viral News: బైక్ పేపర్లు లేవంటూ చలాన్.. కోపంతో లైన్‌మెన్ చేసిన పనికి బిత్తరపోయిన పోలీసులు..

ఈ ఆసక్తికరమైన కేసు సిరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్దాస్‌పూర్ పోలీస్ పోస్ట్‌కి చెందినది. అవుట్‌పోస్టు ఇన్‌చార్జి వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో..

Viral News: బైక్ పేపర్లు లేవంటూ చలాన్.. కోపంతో లైన్‌మెన్ చేసిన పనికి బిత్తరపోయిన పోలీసులు..
Representative image
Follow us

|

Updated on: Jun 12, 2022 | 1:29 PM

యూపీలోని బరేలీలో ఓ విచిత్రమైన ప్రతీకార కేసు తెరపైకి వచ్చింది. ఓ ఇన్‌స్పెక్టర్ విద్యుత్ శాఖకు చెందిన లైన్‌మెన్ బైక్‌కు చలాన్ విధించాడు. దాంతో ఆగ్రహించిన లైన్‌మెన్ పోలీస్ పోస్ట్‌లోని కరెంటును కట్ చేశాడు. కరెంటు లేకపోవడంతో పోలీసులు చీకట్లో గడపాల్సి వచ్చింది. ఈ ఆసక్తికరమైన కేసు సిరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్దాస్‌పూర్ పోలీస్ పోస్ట్‌కి చెందినది. అవుట్‌పోస్టు ఇన్‌చార్జి వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. ఇంతలో బార్సర్ సబ్ స్టేషన్ లైన్ మెన్ భగవాన్ స్వరూప్ అలియాస్ పింకీ బైక్ పై వస్తున్నాడు. సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్ మోడీ సింగ్ లైన్‌మెన్‌ను ఆపి బైక్ పేపర్లు చూపించమని అడిగాడు.

లైన్‌మెన్ పోలీసుతో, “సార్, ఈ సమయంలో మోటారుసైకిల్ పేపర్లు లేవు. ఇంటి నుంచి తెచ్చి చూపిస్తాను’ అంటూ పేర్కొన్నాడు. కానీ, ఇన్‌స్పెక్టర్ మోదీ సింగ్ అంగీకరించకపోవడంతో పింకీ బైక్‌కు చలాన్ విధించాడు. దీంతో కోపోద్రిక్తుడైన లైన్‌మెన్ పింకీ విద్యుత్ శాఖలోని ఇతర ఉద్యోగులను పిలిపించి పోలీసు పోస్టు కరెంటు కట్ చేశాడు.

ఆ తర్వాత పోలీసులు లైన్‌మెన్‌ను వేడుకోవడం మొదలుపెట్టారు. కానీ అతను పోస్ట్‌కు విద్యుత్ కనెక్షన్‌ మాత్రం ఇవ్వలేదు. లైన్‌మెన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్‌ పోస్టులో విద్యుత్‌ కనెక్షన్‌ లేదు. ఔట్‌పోస్టు వద్ద అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. అదే సమయంలో సరైన విద్యుత్ కనెక్షన్ లేకపోవడంపై పోలీసులను ప్రశ్నించగా.. దీనిపై ఎలాంటి సమాధానం చెప్పలేదంటూ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరోవైపు, సిరౌలి పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ మోడీ సింగ్ ప్రకారం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెల్మెట్, పేపర్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని తనిఖీలు చేస్తున్నారు. లైన్‌మెన్ పింకీ వద్ద బైక్ పేపర్లు లేకపోవడంతో అతని చలాన్ విధించామంటూ చెప్పుకొచ్చాడు.

అదే సమయంలో బరేలీ డివిజన్ విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ సంజయ్ జైన్ మాట్లాడుతూ.. పోలీస్ చెక్‌పోస్టు విద్యుత్‌ను డిస్‌కనెక్ట్ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరుపుతామని తెలిపాడు. ఆ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్