AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: నర్సు తప్పిదంతో మారిన శిశువు తల్లిదండ్రులు.. కట్ చేస్తే.. 3 ఏళ్ల తర్వాత కలిశారు.. అసలేం జరిగిందంటే?

2019లో ఇద్దరు గర్భిణులు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వారిలో ఒకరి బిడ్డ చనిపోయి పుట్టింది. అయితే నర్సు ప్రమాదవశాత్తు ఆ బిడ్డను మరొక మహిళకు అందించింది.

Viral: నర్సు తప్పిదంతో మారిన శిశువు తల్లిదండ్రులు.. కట్ చేస్తే.. 3 ఏళ్ల తర్వాత కలిశారు.. అసలేం జరిగిందంటే?
Child
Venkata Chari
|

Updated on: Jun 12, 2022 | 12:58 PM

Share

ఓ జంటకు మూడేళ్ల తర్వాత కొడుకు పుట్టాడు. కానీ, నర్సు తప్పిదంతో పుట్టిన వెంటనే ఆ బిడ్డను కోల్పోయారు. చివరకు మూడేళ్ల తర్వాత డీఎన్‌ఏ పరీక్ష తర్వాత కోర్టు తీర్పుతో బిడ్డను నిజమైన తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. ఈ ఘటన అస్సాంలోని బార్‌పేట జిల్లాలో చోటుచేసుకుంది. నజ్మా ఖానుమ్ అనే ఇద్దరు గర్భిణులు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఇద్దరికీ ఒకే పేరు ఉండడంతో నర్సు తప్పులో కాలు వేసింది. దీంతో చిన్నారుల విషయంలోనూ తీవ్రమైన అయోమయం ఏర్పడింది.

2019లో నజ్మా ఖాన్ అనే ఇద్దరు గర్భిణులు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వారిలో ఒకరి బిడ్డ చనిపోయి పుట్టింది. అయితే నర్సు ప్రమాదవశాత్తు బిడ్డను మరొకరి బిడ్డను వేరే జంటకు అందించింది. దీంతో చిన్నారి అసలు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ తర్వాత జిల్లా కోర్టు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని ఆదేశించింది. దీంతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించింది. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత డీఎన్‌ఏ ఫలితాలతో మూడేళ్ల చిన్నారిని నిజమైన తల్లి నజ్మా ఖానుమ్‌కు అప్పగించాలని శుక్రవారం ఆదేశించింది.

ఖానుమ్ మార్చి 3, 2019న ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మెడికల్ కాలేజీలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆమెను ఐసీయూలో ఉంచి, అప్పుడే పుట్టిన బిడ్డను బేబీ రూమ్‌లో ఉంచారు. మరుసటి రోజు ఆసుపత్రి నిర్వాహకులు మీ కుమారుడు చనిపోయాడని ఖనుమ్ భర్తకు తెలియజేశారు. పుట్టినప్పుడు తమ కొడుకు ఆరోగ్యంగా ఉన్నాడంటూ బార్‌పేట సదర్ పోలీస్ స్టేషన్‌లో ఆసుపత్రిపై కేసు పెట్టారు.

ఇవి కూడా చదవండి

నర్సు తప్పిదంతో..

విచారణలో, గోసాయిగావ్‌కు చెందిన నజ్మా ఖాతూన్ తన నవజాత శిశువును అదే రోజు చాలా తీవ్రమైన స్థితిలో అదే ఆసుపత్రిలో జాయిన్ చేసింది. అయితే, అదే రోజు ఆ చిన్నారి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. డ్యూటీలో ఉన్న నర్సు ఇద్దరు శిశువులను చేరదీసి, చనిపోయిన బిడ్డను నజ్మా ఖానుమ్ భర్తకు అప్పగించింది. కోర్టు ఆదేశాల మేరకు నవజాత శిశువు నిజమైన తల్లిదండ్రులు డీఎన్‌ఏ పరీక్ష ద్వారా నిర్ణయించారు. దీంతో ఈ సమస్యకు చివరకు ఫుల్ స్టాప్ పడింది.

Follow Us
సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే
సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే
భార్య ప్రియాంక సంస్కృతిని గౌరవిస్తూ నిక్ జోనస్ కొత్త ట్రెండ్!
భార్య ప్రియాంక సంస్కృతిని గౌరవిస్తూ నిక్ జోనస్ కొత్త ట్రెండ్!
రాణి విక్టోరియా–క్లియోపాత్రా వరకు అందరినీ ఊరించిన డిజైన్..
రాణి విక్టోరియా–క్లియోపాత్రా వరకు అందరినీ ఊరించిన డిజైన్..
మలైకా షేర్ చేసిన 5 మ్యాజికల్ మూవ్‌మెంట్స్.. ఇంట్లోనే ఫిట్‌నెస్‌
మలైకా షేర్ చేసిన 5 మ్యాజికల్ మూవ్‌మెంట్స్.. ఇంట్లోనే ఫిట్‌నెస్‌
ఫిట్‌నెస్ ప్లస్ మెంటల్ పీస్‌కు నివేధా పేతురాజ్ చెబుతున్న టిప్స్
ఫిట్‌నెస్ ప్లస్ మెంటల్ పీస్‌కు నివేధా పేతురాజ్ చెబుతున్న టిప్స్
Horoscope Today: ఆ రాశి వారు శుభవార్తలు వింటారు..
Horoscope Today: ఆ రాశి వారు శుభవార్తలు వింటారు..
మిచెలిన్ స్టార్ హోటల్‌లో ‘చాక్లెట్ థెరపీ’.. చేతులతోనే చాక్లెట్..
మిచెలిన్ స్టార్ హోటల్‌లో ‘చాక్లెట్ థెరపీ’.. చేతులతోనే చాక్లెట్..
జపాన్ జూలో పుట్టిన ‘పంచ్’ ఆవేదన.. మాతృత్వానికి దూరమైన పసి ప్రాణం
జపాన్ జూలో పుట్టిన ‘పంచ్’ ఆవేదన.. మాతృత్వానికి దూరమైన పసి ప్రాణం
ఎన్టీఆర్ సలహాపై బాలకృష్ణ చేసిన సినిమా..
ఎన్టీఆర్ సలహాపై బాలకృష్ణ చేసిన సినిమా..
అల్లిసిన్ మ్యాజిక్.. రక్తనాళాలను క్లీన్ చేసే సహజ సిద్ధమైన మందు!
అల్లిసిన్ మ్యాజిక్.. రక్తనాళాలను క్లీన్ చేసే సహజ సిద్ధమైన మందు!