Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాదంలో బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌.. జాతీయ గీతాన్ని అవమానించారంటూ ప్రతిపక్షాల ఫైర్

జాతీయ గీతాన్ని అవమానించారనే ఆరోపణలతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ముజఫర్‌పూర్‌లోని ఏసీజేఎం వెస్ట్రన్ కోర్టులో కేసు నమోదైంది. మార్చి 20న జరిగిన ఒక కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపించే సమయంలో ఆయన అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును భారత శిక్షాస్మృతి మరియు జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం కింద నమోదు చేశారు.

వివాదంలో బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌.. జాతీయ గీతాన్ని అవమానించారంటూ ప్రతిపక్షాల ఫైర్
Nitish Kumar 1 1[1]
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 21, 2025 | 9:40 PM

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ACJM వెస్ట్రన్ కోర్టులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై కేసు నమోదైంది. జాతీయ గీతాన్ని అవమానించారనే అభియోగంపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 298, 352 మరియు జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టంలోని సెక్షన్లు 2, 3 కింద కేసు నమోదు చేశారు. పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో, జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఉన్నతాధికారితో మాట్లాడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

దీనిపై న్యాయవాది సూరజ్ కుమార్ ముజఫర్‌పూర్ ACJM వెస్ట్రన్ కోర్టులో కేసు దాఖలు చేశారు. జాతీయ గీతాన్ని అవమానించారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కేసు నమోదైంది. మార్చి 20న జరిగిన సెపక్త్ర ప్రపంచ కప్ మ్యాచ్ ప్రారంభోత్సవం సందర్భంగా జాతీయ గీతం ఆలపించడం జరగుతుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నవ్వుతూ, పక్కవారితో మాట్లాడుతూ కనిపించారు నితీష్‌కుమార్‌. పక్కనే ఉన్న ఐఏఎస్‌ ఆఫీసర్‌ వారిస్తున్నా వినిపించుకోలేదని న్యాయవాది సూరజ్ కుమార్ ఆరోపించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ గీతాన్ని అవమానించారని ఆయన అన్నారు. ఆయనతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా అవమానించారని, ముఖ్యమంత్రి చర్య పట్ల బీహార్ మాత్రమే కాదు, దేశం మొత్తం సిగ్గుపడుతోందని న్యాయవాది మండిపడ్డారు. దీనికి సంఆబంధించి కోర్టులో కేసు దాఖలైందని తెలిపారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 298, 352, జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టంలోని సెక్షన్లు 2, 3 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. జాతీయ గీతాన్ని అవమానించడం ఎవరికీ క్షమించరానిదని న్యాయవాది సూరజ్ కుమార్ అన్నారు. దీనికి గరిష్టంగా మూడు సంవత్సరాల శిక్ష విధించవచ్చు. కోర్టులో తదుపరి విచారణ తేదీని మార్చి 28గా నిర్ణయించారు.

ఇదిలా ఉండగా, జాతీయ గీతాన్ని అగౌరవపరిచారనే ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని, బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం శాసనసభ, శాసన మండలి ఉభయ సభలలో NDA ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక రోజు ముందు జాతీయ గీతాన్ని అవమానించారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నితీష్ కుమార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. నితీష్ కుమార్ ఎన్డీఏ మిత్రపక్షమైన బీజేపీపై కూడా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గురువారం(మార్చి 20) జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో, జాతీయ గీతాలాపన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలను పలకరిస్తూ కనిపించారు. దీని తరువాత, జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో బీహార్ ముఖ్యమంత్రి వణుకుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. శుక్రవారం, స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్ హెచ్చరికను పట్టించుకోకుండా సభలో ఉన్న నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా ఆర్జేడీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో అసెంబ్లీ, శాసనమండలి కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. సభ వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్, నితీష్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరవపరిచారని ఆరోపించారు. ముఖ్యమంత్రి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు.

గురువారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఒక వీడియోను LoP షేర్ చేసింది. అందులో జాతీయ గీతం ప్లే అవుతుండగా నితీష్ కుమార్ వేదికపై తన ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతున్నట్లు కనిపించారు. ప్రధాన కార్యదర్శి అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, ముఖ్యమంత్రి అతని జోక్యాన్ని పట్టించుకోకుండా అధికారిని నెట్టివేస్తూ తన సంభాషణను కొనసాగించారు. తరువాత, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ జాతీయ గీతం ఆలపించేటప్పుడు శ్రద్ధగా నిలుచున్నప్పుడు, నితీష్ కుమార్ ముందు నిలబడి ఉన్న ప్రజలను చేతులు జోడించి పలకరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..