AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delta Plus Variant: దేశంలో 40కి చేరిన డెల్టా ప్లస్ కేసులు.. ఆ మూడు రాష్ట్రాలకు కేంద్రం సూచనలు.!

దేశంలో కరోనా కేసులు తగ్గినా.. డెల్టా వేరియంట్‌ దడ పుట్టిస్తోంది. ఇప్పటికే డెల్టా కేసులు నమోదవుతుండగా.. కొత్తగా డెల్టా ప్లస్‌ ముప్పు కూడా పొంచి ఉందన్న..

Delta Plus Variant: దేశంలో 40కి చేరిన డెల్టా ప్లస్ కేసులు.. ఆ మూడు రాష్ట్రాలకు కేంద్రం సూచనలు.!
Covid Varriant
Ravi Kiran
|

Updated on: Jun 23, 2021 | 1:19 PM

Share

దేశంలో కరోనా కేసులు తగ్గినా.. డెల్టా వేరియంట్‌ దడ పుట్టిస్తోంది. ఇప్పటికే డెల్టా కేసులు నమోదవుతుండగా.. కొత్తగా డెల్టా ప్లస్‌ ముప్పు కూడా పొంచి ఉందన్న ప్రచారం సాగుతోంది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లలో ఇప్పటికే ఈ తరహా కేసులు వెలుగు చూస్తుండడం కలవరపెడుతోంది. ఆయా రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు కూడా జారీ చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా దేశంలో మొత్తం 40 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదు అయినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందులో మహారాష్ట్రలో 21 కేసులు, మధ్యప్రదేశ్ 6, కేరళ 3, తమిళనాడు 3, కర్ణాటక 2, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూలలో ఒక్కొక్క కేసు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. భారత్‌తో పాటు మరో 8 దేశాల్లో ఈ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నట్టు నిపుణులు ప్రకటించారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని, లేదంటే తీవ్ర ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Also Read:

13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!

పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

కాగా, దేశంలో మరోసారి పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరిగింది. కొత్తగా 50,848 పాజిటివ్ కేసులు, 1,358 మరణాలు సంభవించాయి. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,28,709కి చేరింది. ఇందులో 6,43,194 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 68,817 మంది దేశవ్యాప్తంగా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,89,94,855కి చేరింది. అటు నిన్న 1,358 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,90,660 చేరుకుంది.