Health alert: వరుస మహమ్మారుల దాడి.. పంజాబ్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నిర్ధారణ.. ముందస్తు హెచ్చరికలు చేసిన ప్రభుత్వం..

పంజాబ్‌లో స్వైన్ ఫ్లూ కారణంగా పెద్ద సంఖ్యలో పందులు చనిపోయాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కూడా 16 మంది దీని బారిన పడ్డారు. దీంతో హర్యానా కూడా అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో కూడా మాస్క్ లేకుండా ప్రయాణించవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Health alert: వరుస మహమ్మారుల దాడి.. పంజాబ్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నిర్ధారణ.. ముందస్తు హెచ్చరికలు చేసిన ప్రభుత్వం..
African Swine Fever
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 4:21 PM

African Swine Fever: ఓ వైపు కరోనా వైరస్, మరోవైపు లంపి మహమ్మారి ముప్పు..ఈ మధ్యలోనే ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కూడా దాడిచేయడం ప్రారంభించింది. మధ్యప్రదేశ్ తర్వాత, ఇప్పుడు పంజాబ్‌లో కూడా స్వైన్ ఫ్లూ పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో ఉత్తరాది రాష్ట్రాలు ఈ మహమ్మారి బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పంజాబ్‌లోని పాటియాలాలో స్వైన్ ఫ్లూ అనుమానిత లక్షణాలతో 250కి పైగా పందులు చనిపోవడంతో అలర్ట్ ప్రకటించారు. ఈ పందుల నమూనాలను పరీక్షలకు పంపారు. టెస్టు రిపోర్ట్స్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు పంజాబ్‌ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లర్ వెల్లడించారు. తీవ్ర జ్వరం, చెవులు, కడుపులో రక్తపు మరకలు వంటి లక్షణాలతో పందులలో ఆకస్మిక మరణాలు సంభవించినట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని సంబంధిత రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

పాజిటివ్‌గా తేలిన పందులకు సంబంధించిన ఆ రెండు గ్రామాల నుండి ఒక కిలోమీటరు వరకు కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టారు. 10 కిమీ వరకు క్వారంటైన్‌ ఏర్పాటు చేశారు. పెంపుడు పందులను ప్రభావితం చేసే అత్యంత అంటువ్యాధి, ప్రాణాంతక వైరల్ వ్యాధిని భోపాల్‌లోని ICAR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ధృవీకరించిందని భుల్లర్ చెప్పారు. పందుల పెంపకందారులు వాటి వ్యర్థాలు, ఏదైనా ఇతర పదార్థాలను బయటకు తీసుకురాకుండా ఉండాలని సూచించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పందుల అంతర్రాష్ట్ర సంచారం, పందుల పెంపకానికి సంబంధించి అన్ని రకాల సరఫరాలను నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

అటు, హర్యానాలో కూడా లంపి మహమ్మారి,స్వైన్ ఫ్లూ గురించి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ శుక్రవారం అధికారులతో సమావేశమయ్యారు. కోవిడ్ కాలం మాదిరిగానే మిషన్ మోడ్‌లో పనిచేయాలని ఆయన అధికారులను కోరారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇండోర్‌లో ఇప్పటివరకు 16 మందిలో స్వైన్ ఫ్లూ H1N1 వైరస్ కనుగొనబడింది. వీరిలో నలుగురిని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది.

అటు, దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ విధ్వంసం వ్యాప్తి చెందుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు చివరి నుండి సెప్టెంబర్ మధ్య వరకు స్వైన్ ఫ్లూ విధ్వంసం కొనసాగుతుందని హెచ్చరించారు. స్వైన్ ఫ్లూ, కరోనా మహమ్మారి, వైరస్ ద్వారా వ్యాపించే అన్ని వ్యాధులకు ఫేస్‌మాస్క్ మాత్రమే నివారణ చర్య అని నిపుణులు స్పష్టంగా చెప్పారు. ప్రజలు గరిష్టంగా మాస్క్‌లు ధరించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
'చంద్రబాబుది ఊరసవెల్లి రాజకీయం'.. సింహపురి ఎన్నికల ప్రచారంలో జగన్
'చంద్రబాబుది ఊరసవెల్లి రాజకీయం'.. సింహపురి ఎన్నికల ప్రచారంలో జగన్
బెల్లం కలిపిన పాలు తాగితే సూపర్ బెనిఫిట్స్
బెల్లం కలిపిన పాలు తాగితే సూపర్ బెనిఫిట్స్
అప్పుడే పెళ్లెందుకు అనుకుంటున్నారా..? లేట్ అయితే లాసే..
అప్పుడే పెళ్లెందుకు అనుకుంటున్నారా..? లేట్ అయితే లాసే..
మీలో ఈ లక్షణాలున్నాయా.? ఒమేగా-3 లోపం ఉన్నట్లే..
మీలో ఈ లక్షణాలున్నాయా.? ఒమేగా-3 లోపం ఉన్నట్లే..
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రిష్ 4 వచ్చేస్తున్నాడు..
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రిష్ 4 వచ్చేస్తున్నాడు..
గుడ్డు.. వెరీగుడ్డు.. గాడిద గుడ్డు.. తెలంగాణలో పొలిటికల్ హీట్..
గుడ్డు.. వెరీగుడ్డు.. గాడిద గుడ్డు.. తెలంగాణలో పొలిటికల్ హీట్..
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత