AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkey Disease: దడ పుట్టిస్తోన్న మంకీ ఫీవర్‌ కేసులు.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ! కొత్తగా మరో ఏడుగురికి వ్యాధి నిర్ధారణ

దేశంలోని పలు ప్రాంతాల్లో మంకీ డిసీజ్‌ దడ పుట్టిస్తోంది. కర్ణాటకలోని కొప్ప తాలూకా బారెగుంజి గ్రామానికి చెందిన మరో ఏడుగురికి మంకీ డిసీజ్‌ ( కేఎఫ్‌డీ ) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆదివారం అడవి నుంచి కట్టెలు తెచ్చేందుకు వెళ్లిన 21 మంది రక్తాన్ని ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించారు. 21 మందిలో ఏడుగురికి మాంగనీస్ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. దీంతో చిక్కమగళూరు జిల్లాలో ఇప్పటి వరకూ ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 19 కి..

Monkey Disease: దడ పుట్టిస్తోన్న మంకీ ఫీవర్‌ కేసులు.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ! కొత్తగా మరో ఏడుగురికి వ్యాధి నిర్ధారణ
Monkey Disease
Srilakshmi C
|

Updated on: Feb 13, 2024 | 2:39 PM

Share

చిక్కమగళూరు, ఫిబ్రవరి 13: దేశంలోని పలు ప్రాంతాల్లో మంకీ డిసీజ్‌ దడ పుట్టిస్తోంది. కర్ణాటకలోని కొప్ప తాలూకా బారెగుంజి గ్రామానికి చెందిన మరో ఏడుగురికి మంకీ డిసీజ్‌ ( కేఎఫ్‌డీ ) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆదివారం అడవి నుంచి కట్టెలు తెచ్చేందుకు వెళ్లిన 21 మంది రక్తాన్ని ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించారు. 21 మందిలో ఏడుగురికి మాంగనీస్ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. దీంతో చిక్కమగళూరు జిల్లాలో ఇప్పటి వరకూ ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 19 కి పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలో 74 మందికి పరీక్షలు నిర్వహించారు. రోజురోజుకు అక్కడ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు హాయ్‌ల్యాండ్‌లో కేఎఫ్‌డీపై అవగాహన కల్పిస్తున్నారు.

గతంలో 9 కేసులు నమోదు

గతంలోనూ ఇక్కడ 9 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 08 వరకు చిక్కమగళూరు జిల్లాలో తొమ్మిది మందికి మంకీ డిసీజ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లాలో వ్యాధి సోకిన తొమ్మిది మందిలో ఒకరు మృతి చెందారు. వీరిలో నలుగురు కోలుకోగా మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక్కడ గుర్తించిన మంకీ డిసీజ్‌ అత్యధిక సంఖ్యలో OLV ఎస్టేట్‌లో కనుగొన్నారు. ఈ OLV ఎస్టేట్ కొప్ప తాలూకాలో ఉంది. దీంతో ఆరోగ్యశాఖ ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించింది. అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ బాధిత ప్రాంతాల్లో తగు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కొప్ప ప్రభుత్వాసుపత్రిలో కేఎఫ్‌డీ వార్డును ప్రారంభించింది.

ఈ ప్రాంతంలో మంకీ ఫీవర్‌తో పాటు డెంగ్యూ జ్వరం కూడా విస్తరిస్తున్నందున ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా ఆ జిల్లాలో డెంగ్యూ జ్వరంతో ఓ కాలేజీ విద్యార్థి మృతి చెందడం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.