Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: మహారాష్ట్రలో ఘోర విషాదం.. రేకుల షెడ్డుపై చెట్టు కూలి 7 గురు మృతి

మహారాష్ట్రలోని అకోల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షం వల్ల ఓ చిన్న రేకుల షెడ్డుపై చెట్టు పడిపోవడంతో 7 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రోజున అకోల జిల్లా పరాస్ లోని ఓ ఆలయం వద్ద జరుగుతున్న మతపరమైన వేడుకకు చాలామంది భక్తులు హాజరయ్యారు.

Maharashtra: మహారాష్ట్రలో ఘోర విషాదం.. రేకుల షెడ్డుపై చెట్టు కూలి 7 గురు మృతి
Tiny Shed
Follow us
Aravind B

|

Updated on: Apr 10, 2023 | 9:26 AM

మహారాష్ట్రలోని అకోల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షం వల్ల ఓ చిన్న రేకుల షెడ్డుపై చెట్టు పడిపోవడంతో 7 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రోజున అకోల జిల్లా పరాస్ లోని ఓ ఆలయం వద్ద జరుగుతున్న మతపరమైన వేడుకకు చాలామంది భక్తులు హాజరయ్యారు. అయితే రాత్రి ఏడు గంటకు ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. అయితే అక్కడే ఓ చిన్న రేకుల షెడ్డులో కొంతమంది భక్తులు సేద తీరుతున్నారు. కానీ భారీ వర్షం, ఈదురు గాలుల ప్రభావానికి దాని పక్కనే ఉన్న ఓ పెద్ద వేపచెట్టు ఆ రేకుల షెడ్డుపై పడింది.దీంతో 7 గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం తెలుసుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని రంగంలోకి దిగారు. పడిపోయిన చెట్టును, కూలిన షెడ్డును పైకి లేపేందుకు జేసీబీ మిషన్లను తెప్పించారు. అయితే ఆ చెట్టు పడిపోయినప్పడు ఆ షెడ్డు కింద దాదాపు నలభైమంది ఉన్నారని అందులో 36 మందికి గాయాలయ్యాయని అకోలా జిల్లా కలెక్టర్ నీమ అరోర తెలిపారు. వారిని ఆస్పత్రకి తరలిస్తుండగా నలుగురు చనిపోయారని..ఆ తర్వాత మరో ఇద్దరు చనిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోవడంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందిస్తుందని ప్రకటించారు. గాయాలపాలైన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి