Zika virus : చాపకింద నీరులా విస్తరిస్తున్న జికా వైరస్.. కేరళలో పెరుగుతున్న కేసులు..
Kerala Zika virus Cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో జికా వైరస్ అలజడి సృష్టిస్తోంది. కేరళలో ఈ కేసుల
Kerala Zika virus Cases: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో జికా వైరస్ అలజడి సృష్టిస్తోంది. కేరళలో ఈ కేసుల సంఖ్య చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 22కి చేరినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ మీడియాతో పేర్కొన్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన 38 ఏళ్ల వైద్యుడికి జికా సోకినట్టు పేర్కొన్నారు. పరీక్షల అనంతరం కోయంబత్తూరు ల్యాబ్ నిర్ధారించిందని పేర్కొన్నారు. అలాగే, వైరస్ సోకినవారిలో 35 ఏళ్ల వ్యక్తితో పాటు 41 ఏళ్ల మహిళ కూడా ఉన్నట్లు వీణాజార్జ్ వెల్లడించారు.
ఈ బాధితుల శాంపిల్స్ను ప్రభుత్వ వైద్య కళాశాలలోని వైరాలజీ ల్యాబ్తో పాటు కోయంబత్తూరుకు చెందిన ఓ ల్యాబ్లో పరీక్షించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో జికా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో జికా వైరస్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని.. అనుమానితులు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
జికా వైరస్ ఏడిస్ ఈజిప్టి దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. జికా వైరస్ను 1947లో కోతుల్లో మొదటిసారి గుర్తించారు. 1952లో ఉగాండాలో మనుషుల్లో గుర్తించారు. జికా సోకితే జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి, నీరసం లాంటి లక్షణాలు కనిస్తాయి. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. పిల్లలకు సోకితే ఈ వైరస్ వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
Also Read: