AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపలతో వీటిని కలిపి తిన్నారో.. విషం తీసుకున్నట్లే! కాస్త చూస్కోండి..

భోజన ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో చేపలు ఒకటి. చేపల పులుసు, క్రిస్పీ చేపల ఫ్రైస్‌ ఇలా రకరకాల రుచులను ఆస్వాధిస్తుంటారు. చేపలు రుచిగా ఉండటమే కాదు ఒమేగా-3 ఫ్యాటీ అమ్లాలు, ప్రోటీన్లు ఇందులో దండిగా ఉంటాయి. అయితే కొన్ని ఆహారాలతో చేపలు తినడం వల్ల అవి శరీరంలో విషపూరిత ప్రతిచర్యలు కలిగిస్తాయని పోషకాహార నిపుణులు..

చేపలతో వీటిని కలిపి తిన్నారో.. విషం తీసుకున్నట్లే! కాస్త చూస్కోండి..
Fish 1
Srilakshmi C
|

Updated on: Dec 16, 2025 | 11:52 AM

Share

భోజన ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో చేపలు ఒకటి. చేపల పులుసు, క్రిస్పీ చేపల ఫ్రైస్‌ ఇలా రకరకాల రుచులను ఆస్వాధిస్తుంటారు. చేపలు రుచిగా ఉండటమే కాదు ఒమేగా-3 ఫ్యాటీ అమ్లాలు, ప్రోటీన్లు ఇందులో దండిగా ఉంటాయి. అయితే కొన్ని ఆహారాలతో చేపలు తినడం వల్ల అవి శరీరంలో విషపూరిత ప్రతిచర్యలు కలిగిస్తాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా చేపలలోని పోషకాలను గ్రహించడానికి బదులుగా, జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తాయి. అలాంటి కాంబినేషన్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

చేపలు తినే సమయంలో పెరుగు, పాలు, మజ్జిగ, జున్ను వంటి పాల ఉత్పత్తులను తినకూడదు. ఎందుకంటే చేపలు, పాల ఉత్పత్తులు రెండింటిలోనూ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. రెండింటిలోనూ సమ్మేళనాలు కలిస్తే జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తాయి. ఇది కడుపు నొప్పి, అసౌకర్యం, గ్యాస్, తీవ్రమైన జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. చేపలతో పాటు విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయలు ఇతర సిట్రస్ పండ్లను తినడం మానుకోవాలి. ఎందుకంటే విటమిన్ సి, చేపలు తీవ్రమైన జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రుచికి కొద్దిగా నిమ్మరసం సరైనదే, కానీ ఎక్కువగా తీసుకోకూడదు.

అలాగే పాలకూర, కొత్తిమీర వంటి కొన్ని ఆకుకూరలను చేపలతో కలిపి ఎక్కువగా తినకూడదు. వీటిని ఎక్కువ పరిమాణంలో తింటే, శరీరం చేపలలోని కాల్షియంను సరిగ్గా గ్రహించదు. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం వస్తుంది. చేపలు తిన్న వెంటనే స్వీట్లు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. దీనివల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చేపలతో మద్యం లేదా వైన్ తాగే అలవాటు ఉంటే వెంటనే దానిని మానేయడం మంచిది. ఇది కాలేయంపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. చేపలు తిన్న వెంటనే మద్యం తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

గమనిక: ఇందులో ఇచ్చిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వాటిని మేము నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు నిపుణుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..