Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Patients: ఈ డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి తినడం షుగర్ పేషెంట్స్‌కు ఓ వరం అంటున్న నిపుణులు.. అవి ఏమిటంటే

డయాబెటిక్ పేషెంట్స్ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను డైట్ లో చేర్చుకోవాలని నారాయణ హాస్పిటల్ సీనియర్ డైటీషియన్ పాయల్ శర్మ అంటున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే మరింత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఏ డ్రై ఫ్రూట్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..

Diabetes Patients: ఈ డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి తినడం షుగర్ పేషెంట్స్‌కు ఓ వరం అంటున్న నిపుణులు.. అవి ఏమిటంటే
Dry Fruits For Diabetes Patients
Follow us
Surya Kala

|

Updated on: Jul 24, 2024 | 5:06 PM

మధుమేహాన్ని షుగర్ అని కూడా అంటారు. ఇందులో శరీరంలోని బ్లడ్ షుగర్ సాధారణ స్థాయి నుంచి పెరుగుతుంది. తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు శరీరంలో రక్తంలో చక్కెర పెరుగుతుంది. కొన్నిసార్లు శరీరంలోని కణాలు ఇన్సులిన్‌ను నియంత్రించ లేవని నిపుణులు చెబుతున్నారు. అటువంటి సమయంలో డయాబెటిక్ పేషెంట్స్ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను డైట్ లో చేర్చుకోవాలని నారాయణ హాస్పిటల్ సీనియర్ డైటీషియన్ పాయల్ శర్మ అంటున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే మరింత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఏ డ్రై ఫ్రూట్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..

వాల్నట్(అక్రోటుకాయ)

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఫైబర్, ప్రొటీన్లు కూడా వాల్‌నట్స్‌లో ఉంటాయి. ఈ మూడు మూలకాలు రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతాయి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. నానబెట్టిన తర్వాత తిన్న వాల్‌నట్‌లు డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బాదం పప్పు

రోజూ బాదంపప్పు తింటే మెదడుకు పదును పెడుతుంది. మధుమేహం వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. బాదంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, బాదం గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది.

పిస్తాపప్పు

పిస్తాపప్పులు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పిస్తాపప్పులో అధిక మొత్తంలో ఫైబర్, ప్రొటీన్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. పిస్తాపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని, ఇవి శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు.

జీడిపప్పు

జీడిపప్పులో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు జీడిపప్పులో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందువల్ల మధుమేహం విషయంలో ఎటువంటి భయం జీడిపప్పుని తినవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)