AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ పొద్దున్నే నెయ్యిని ఇలా తీసుకుంటే ఊహించని లాభాలు.. వెంటనే అలవాటు చేసుకోండి..

మెరిసే చర్మం కావాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. చర్మం పొడిబారకుండా ఎల్లప్పుడూ తేమగా ఉండాలంటే నెయ్యి కలిపిన నీళ్లను తీసుకోవాలి. దీనివల్ల శరీరంలోని చెడు పదార్థాలు బయటకు పోయి చర్మానికి కావలసిన మెరుపు వస్తుంది.  నెయ్యిని తీసుకుంటే ఎముకల బలం పెరుగుతుంది. దృష్ఠి సమస్యలు దూరమవుతాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జీవక్రియ ప్రక్రియ పెరుగుతుంది.

రోజూ పొద్దున్నే నెయ్యిని ఇలా తీసుకుంటే ఊహించని లాభాలు.. వెంటనే అలవాటు చేసుకోండి..
Ghee With Warm Water
Jyothi Gadda
|

Updated on: Dec 29, 2024 | 7:46 PM

Share

నెయ్యిలోని ఔషధ గుణాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి ప్రోటీన్స్, కొవ్వుని కరిగించే విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. నెయ్యి వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే, నెయ్యి కలిపిన నీళ్లను రోజూ ఉదయం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడటమే కాకుండా కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. మరిన్ని లాభాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో 2 టేబుల్‌ స్పూన్ల నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.ఎముకలు ధృడంగా తయారవుతాయి. నెయ్యిలో బ్యూటిరిక్ ఆమ్లము ఉంటుంది. దీని కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే రోజు ఉదయం నెయ్యి కలిపిన నీళ్లను తీసుకోవడం మంచిది.

మెరిసే చర్మం కావాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. చర్మం పొడిబారకుండా ఎల్లప్పుడూ తేమగా ఉండాలంటే నెయ్యి కలిపిన నీళ్లను తీసుకోవాలి. దీనివల్ల శరీరంలోని చెడు పదార్థాలు బయటకు పోయి చర్మానికి కావలసిన మెరుపు వస్తుంది.  నెయ్యిని తీసుకుంటే ఎముకల బలం పెరుగుతుంది. దృష్ఠి సమస్యలు దూరమవుతాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జీవక్రియ ప్రక్రియ పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రేగు వాపుని తగ్గిస్తుంది. ఎముకల కీళ్ళకు బలాన్ని అందించడంలో నెయ్యి బాగా సాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉండి అనవసర నొప్పులు తగ్గిపోతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..