AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: అద్దంలా మెరిసే అందం కోసం.. ఈ 5 పదార్థాలను బియ్యప్పిండిలో మిక్స్ చేసి రాస్తే..

మీ వంటగదిలో ఉండే పదార్థాలతో తయారు చేసుకునే సహజమైన ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. బియ్యం పిండిలో ఇలాంటి వంటింటి పదార్థాలను కలిపి రాసుకుంటే.. చర్మం మెరుగుపడటమే కాకుండా గాజులా మెరిపింపజేస్తుంది. ఈ మూలకాలన్నీ మీ చర్మాన్ని పోషించి, మృతకణాలను తొలగించి, ముఖాన్ని మరింత అందంగా మారుస్తాయి.

Beauty Tips: అద్దంలా మెరిసే అందం కోసం.. ఈ 5 పదార్థాలను బియ్యప్పిండిలో మిక్స్ చేసి రాస్తే..
Clear Skin
Jyothi Gadda
|

Updated on: Feb 19, 2024 | 10:05 PM

Share

ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా ముఖం విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ అందంగా, మెరిసే ముఖాన్ని ఇష్టపడతారు. ఇది అందంగా కనిపించడమే కాదు, మనలో మనం సంతోషంగా, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అందమైన ముఖం ఇతరులను మనవైపు ఆకర్షిస్తుంది. లోపల నుండి మనకు ఆనందాన్ని ఇస్తుంది. దీని కోసం చాలా మంది అనేక రకాల సౌందర్య సాధనాలు, ఇంటి నివారణలను ప్రయత్నిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ ముఖం మెరుపును కాపాడుకోవాలనుకుంటే బియ్యప్పిండిలో ఈ ఐదు పదార్థాలను మిక్స్ చేసి అప్లై చేయండి.

మీ వంటగదిలో ఉండే పదార్థాలతో తయారు చేసుకునే సహజమైన ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. బియ్యప్పిండిలో పసుపు, పెరుగు, నిమ్మరసం, తేనె, టొమాటో జ్యూస్ వంటి పదార్థాలను కలిపి ముఖానికి అప్లై చేయటం వల్ల  చర్మం మెరుగుపడటమే కాకుండా గాజులా మెరిపింపజేస్తుంది. ఈ మూలకాలన్నీ మీ చర్మాన్ని పోషించి, మృతకణాలను తొలగించి, ముఖాన్ని మరింత అందంగా మారుస్తాయి.

బియ్యం పిండిలో పసుపు..

ఇవి కూడా చదవండి

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. బియ్యప్పిండిలో కాస్త పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే మార్పును మీరే గమనిస్తారు.

బియ్యం పిండి, పెరుగుతో అప్లై చేయండి..

పెరుగు చర్మానికి తేమను అందించి మెరుపును తెస్తుంది. బియ్యప్పిండిలో పెరుగు కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి. దీంతో ముఖంలో మెరుపు వస్తుంది.

బియ్యం పిండిలో నిమ్మరసం..

నిమ్మరసం చర్మాన్ని శుభ్రపరుస్తుంది. కాంతివంతంగా మారుస్తుంది. బియ్యప్పిండిలో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మెరుగవుతుంది. ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.

బియ్యం పిండితో తేనె కలిపి వాడితే..

తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. తేమను కాపాడుతుంది. బియ్యప్పిండిలో తేనె కలిపి రాసుకుంటే చర్మం మృదువుగా, మెరిసిపోతుంది. బియ్యం పిండి చర్మం పై పొరను సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. తేనె లోతుగా పోషణను, తేమను అందిస్తుంది.

బియ్యం పిండి, టమాటా జ్యూస్…

టమాటా రసం చర్మాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని టోన్ చేస్తుంది. టొమాటో రసాన్ని బియ్యప్పిండిలో కలిపి రాసుకుంటే చర్మం క్లియర్ గా మెరుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్