AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం..మహిళను స్థంభానికి కట్టేసి…

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లిలో తండాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థల వివాదంలో జ్యోతి అనే మహిళను స్థంబానికి కట్టేసి చెప్పులతో కొట్టారు అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన హంస, స్వరూప, రమ అనే ముగ్గురు మహిళలకు పోరెడ్డి పల్లి తండాలో వ్యవసాయ భూములు ఉన్నాయి. అయితే అందులోకి వెళ్లే దారి విషయంలో జ్యోతితో వారికి గొడవ జరిగింది. దీంతో సదరు మహిళలు వారి, వారి భర్తలకు జ్యోతిపై ఫిర్యాదు […]

దారుణం..మహిళను స్థంభానికి కట్టేసి...
Ram Naramaneni
|

Updated on: Jan 12, 2020 | 10:59 AM

Share

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లిలో తండాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థల వివాదంలో జ్యోతి అనే మహిళను స్థంబానికి కట్టేసి చెప్పులతో కొట్టారు అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన హంస, స్వరూప, రమ అనే ముగ్గురు మహిళలకు పోరెడ్డి పల్లి తండాలో వ్యవసాయ భూములు ఉన్నాయి. అయితే అందులోకి వెళ్లే దారి విషయంలో జ్యోతితో వారికి గొడవ జరిగింది. దీంతో సదరు మహిళలు వారి, వారి భర్తలకు జ్యోతిపై ఫిర్యాదు చేశారు. దీంతో రెచ్చిపోయిన ముగ్గురు మహిళల భర్తలు జ్యోతిని గ్రామములోకి  నడి బజారుకు తీసుకెళ్లి స్థంబానికి కట్టేసి కొట్టారు. బాధితురాలి కుంటుంబ సభ్యులు 100కి కాల్ చేయగా… స్థానిక పోలీసులు వచ్చి జ్యోతిని విడిపించారు. ఘటనకు సంబంధం ఉన్న 7 గురిపై కేసు నమోదు చేశారు.  హంస, స్వరూప, రమ, శంకర్, జ్యోతి, కిషన్, కైలు అనే వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్టుగా ప్రాథమిక సమాచారం అందండంతో.. వారిపై 342,448,290,323,506 సెక్షన్లు ఫైల్ చేశారు.