AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతి ఆందోళనలపై ఏపీ డీజీపీకి కేంద్ర మంత్రి ఫోన్

రాజధానిగా అమరావతిని తరలించొద్దంటూ గత కొన్ని రోజులుగా అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఏ స్పష్టతను ఇవ్వకపోగా.. రోజు రోజుకు ఆందోళనల తీవ్రత ఎక్కువవుతోంది. మరోవైపు రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పోలీసుల మోహరించారు. జేఏసీ నేతల ర్యాలీలు, ఆందోళనకారుల అరెస్ట్‌లతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అమరావతిలో పరిస్థితులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫోన్ […]

అమరావతి ఆందోళనలపై ఏపీ డీజీపీకి కేంద్ర మంత్రి ఫోన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 11, 2020 | 10:06 AM

Share

రాజధానిగా అమరావతిని తరలించొద్దంటూ గత కొన్ని రోజులుగా అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఏ స్పష్టతను ఇవ్వకపోగా.. రోజు రోజుకు ఆందోళనల తీవ్రత ఎక్కువవుతోంది. మరోవైపు రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పోలీసుల మోహరించారు. జేఏసీ నేతల ర్యాలీలు, ఆందోళనకారుల అరెస్ట్‌లతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అమరావతిలో పరిస్థితులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. అమరావతిలో రైతులు ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా ఏపీ మూడు రాజధానుల అంశం ఇంకా కేంద్రం దృష్టికి రాలేదని ఇటీవల కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

కాగా గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. నిరసన తెలిపేందుకు రైతులు పరదాలు వేయగా.. పోలీసులు పరదాలను లాగేశారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ ప్రాంతంలో 144 సెక్షన్, యాక్ట్ 30 అమల్లో ఉందని.. అందుకే నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.