AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 నెలల్లో ఇంతలా విఫలమైన సీఎంను చూడలా..

ఆంధ్రప్రదేశ్‌లో జరుగతోన్న అన్ని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యను ఖండించడానికి అందరూ కదిలిరావాలన్నారు. ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు మరో మాట చెబుతున్నారని, ఆరు నెలల్లోనే ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని తెలిపారు. ఆడపడుచులను తీసుకెళ్లి అరెస్ట్ చేశారని, అమ్మవారికి చీర, సారె పెట్టే హక్కు కూడా వారికి లేదా అని ప్రశ్నించారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత […]

6 నెలల్లో ఇంతలా విఫలమైన సీఎంను చూడలా..
Ram Naramaneni
|

Updated on: Jan 11, 2020 | 2:47 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో జరుగతోన్న అన్ని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యను ఖండించడానికి అందరూ కదిలిరావాలన్నారు. ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు మరో మాట చెబుతున్నారని, ఆరు నెలల్లోనే ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని తెలిపారు. ఆడపడుచులను తీసుకెళ్లి అరెస్ట్ చేశారని, అమ్మవారికి చీర, సారె పెట్టే హక్కు కూడా వారికి లేదా అని ప్రశ్నించారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దారుణంగా పరిపాలించిన దాఖలాలు కన్పించడం లేదన్న సుజనా, ఇప్పటికైనా ప్రాంతీయ విద్వేషాలు మానుకుంటే మంచిదని సూచించారు.

13 జిల్లాలు ప్రజలు విజృంభించాలని.. మేథావులు, ఎన్జీవోలు కూడా రైతుల ఉద్యమంలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. అమరావతి రాజధానిని ఒక్క అంగుళం కూడా కదిలించలేరంటూ గతంలో తాను చెప్పిన మాట గుర్తు చేశారు సుజనా. రాజధాని సమస్యను పరిష్కరించకపోతే ఈ 10 ఏళ్లు చేసిన ఎంపీ పదవి, ఇకముందు చేయబోయేది కూడా అనవసరమన్నారు. డీజీపీ అధికార పార్టీకి చెందిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని, ర్యాలీలకు అనుమతి లేనప్పుడు..వైసీపీ కార్యకర్తలకు ఎందుకు అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు.