భార్యకు బెయిల్..భర్త రిలీజ్..
తమిళనాడు సాలెం జిల్లా, ఎత్తాపుర్కు చెందిన భార్యభర్తలు రంజిత్ కుమార్, పవిత్ర.. అదే గ్రామానికి చెందిన సదాశివం మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

తమిళనాడు సాలెం జిల్లా, ఎత్తాపుర్కు చెందిన భార్యభర్తలు రంజిత్ కుమార్, పవిత్ర.. అదే గ్రామానికి చెందిన సదాశివం మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జులై 23న జరిగిన ఈ ఘటన జరగ్గా.. ఇద్దర్నీ సాలెం సెంట్రల్ జైల్లో రిమాండ్కు తరలించారు పోలీసులు.
అదే రోజున మద్రాసు హైకోర్టులో పవిత్ర బెయిల్ పిటిషన్ వేయగా.. కోర్టు మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలు అందుకున్న అధికారులు.. పవిత్రను రిలీజ్ చేయాల్సింది పోయి..పొరపాటున పవిత్ర భర్త రంజిత్ను విడుదల చేశారు. ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా.. పవిత్రను ఎందుకు రిలీజ్ చేయలేదని పవిత్ర బంధువులు అధికారులను ప్రశ్నించారు. అప్పుడు వాకబు చేయగా తప్పు తమవైపే ఉన్నట్టు జైలు అధికారులు తెలుసుకున్నారు. వెంటనే ఎత్తాపుర్కు చేరుకొని, రంజిత్ను తిరిగి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం సాలెం మహిళా జైలు నుంచి పవిత్రను రిలీజ్ చేశారు. దీనిపై విచారణకు ఆదేశించిన జైలు సూపరెంటెండెంట్.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇది కూడా చదవండి : కుమార్తెలతో కాడి మోయిస్తూ రైతు వ్యవసాయం..చలించిపోయిన సోనూసూద్..
