Corona Vaccine: తిరుపతి రుయా ఆసుపత్రిలో విచిత్ర పరిస్థితి.. వ్యాక్సిన్ కోసం ఇంతవరకూ ముందుకు రాని సిబ్బంది

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు 10 నెలలు మహమ్మారితో చేసిన పోరాటానికి స్వస్తి పలికే సుమూహూర్తం వచ్చేసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

Corona Vaccine: తిరుపతి రుయా ఆసుపత్రిలో విచిత్ర పరిస్థితి.. వ్యాక్సిన్ కోసం ఇంతవరకూ ముందుకు రాని సిబ్బంది
Follow us

|

Updated on: Jan 16, 2021 | 11:20 AM

Corona Vaccine:  దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు 10 నెలలు మహమ్మారితో చేసిన పోరాటానికి స్వస్తి పలికే సుమూహూర్తం వచ్చేసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్టయ్యింది. అయితే తిరుపతి రుయా ఆస్పత్రిలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. వ్యాక్సిన్ కోసం ఇంతవరకూ ఎవరూ ముందుకు రాలేదు.  ముందుగా వాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకుని కూడా ఇవాళ సిబ్బంది  వ్యాక్సిన్ వేయించుకునేందుకు అడుగులు వేయడం లేదు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న సిబ్బందికి ఒక్కొక్కరికి ఫోన్లు చేసి వ్యాక్సిన్ వేయించుకునేందుకు  రావాలని అధికారులు కోరుతున్నారు.

ఇక, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు. తొలి విడతలో రాష్ట్రంలో సుమారు 3 లక్షల 80 వేల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేస్తారు. మొత్తం 332 కేంద్రాలకు గాను తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 33 కేంద్రాలు ఏర్పాటు చేయగా, విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 15 కేంద్రాలను అందుబాటులో ఉంచారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు.

Also Read:

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ముదురుతున్న బస్సు సర్వీసుల వివాదం.. సరైన రికార్డులు, పర్మిట్లు లేవంటూ..

నార్వేలో ఫైజర్ వ్యాక్సిన్ వికటించి 23 మంది వృధ్ధుల మృతి, మరో 23 మందికి తీవ్ర అస్వస్థత, విచారణకు ప్రభుత్వ ఆదేశం