Mamta Mohandas: ‘రాజమౌళి అలా అనేసరికి నా గుండె పగిలిపోయింది’
హీరోయిన్ మమతా మోహన్ దాస్ యమదొంగతో తెలుగు తెరకు పరిచయమై, ఆ తర్వాత రెండుసార్లు క్యాన్సర్తో పోరాడి, ప్రస్తుతం రీఎంట్రీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో, యమదొంగ కంటే ముందు అరుంధతి సినిమాలో ఛాన్స్ వచ్చిందని, కానీ మేనేజర్ సలహా మేరకు తిరస్కరించానని వెల్లడించింది. దీనిపై రాజమౌళి తనతో 'పెద్ద తప్పు చేశావు' అన్నారని భావోద్వేగంగా పంచుకుంది. ఆమె జీవితం, కెరీర్లోని కీలక మలుపులను వివరిస్తుంది ఈ కథనం.
హీరోయిన్ మమతా మోహన్ దాస్! ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఆమె నటిగా కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. అదే సమయంలో క్యాన్సర్ బారిన పడింది. రెండుసార్లు క్యాన్సర్ తో పోరాడిన ఆమె.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చి మళ్లీ సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది మమతా..! యమదొంగ సినిమా కంటే ముందు తనకు తెలుగులో ఓ సినిమా ఛాన్స్ వచ్చిందని చెప్పిన మమతా మోహన్ దాస్.. ఆ సినిమా మరేదో కాదు.. అరుంధతి సినిమా అంటూ చెప్పి షాకిచ్చింది. మల్లెమాల ప్రొడక్షన్స్లో తెరకెక్కిన ఈ సినిమాకు తాను సైన్ చేద్దామని మొదట అనుకున్నప్పటికీ… ఆ ప్రొడక్షన్ హౌస్ అంత మంచిది కాదని.. తన మేనేజర్ చెప్పడంతో ఆ సినిమా చేసేందుకు తాను ఒప్పుకోలేదంటూ మమతా చెప్పుకొచ్చింది. అరుంధతి సినిమాలో నటించాలని రెండు మూడు నెలలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అడుగుతూనే ఉన్నారని.. కానీ ఆయన మాటలు తాను పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. ఆ ఏడాది తర్వాత రాజమౌళి ఫోన్ చేసి యమదొంగ సినిమా ఛాన్స్ ఇచ్చారని.. ఆడియషన్స్తో భాగంగా.. తొలి సారి ఆయనను కలిసినప్పుడు.. ‘అరుంధతి సినిమాను వదులుకోకుండా నువ్వు చేయాల్సింది. పెద్ద తప్పు చేశావు అని అన్నారని గుర్తు చేసుకుంది. అంత పెద్ద డైరెక్టర్ అలా అనడంతో తన గుండె పగిలిపోయింది అంటూ మమతా మోహన్ దాస్ కాస్త ఎమోషనల్ అయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Auto Ram Prasad: డైరెక్టర్గా కొత్త జర్నీ.. మొదలు పెట్టిన ఆటో రాంప్రసాద్
Yash: కటింగ్ చేసిన ‘సింహం’ మాదిరి.. KGF హీరో లుక్పై కామెడీ సెటైర్లు
‘కొడవ’ పద్దతిలో విజయ్, రష్మిక వివాహం.. ఈ పెళ్లి ప్రత్యేకలు ఏంటంటే ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

