మాజీమంత్రి రోజా బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెకు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయాధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రోజాతో మాట్లాడేందుకు భక్తులు, మహిళలు ఆసక్తి చూపించారు.