కరెంట్ బిల్లులు మోతపై ఏపీ ట్రాన్స్ కో సీఎండీ క్లారిటీ…
వినియోగదారుల దగ్గర అదనపు కరెంట్ బిల్లులు వసూలు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. మార్చ్, ఏప్రిల్ బిల్లులు కలిపి ఇచ్చారని కొంతమంది అపోహ పడుతున్నారని, రెండు బిల్లులు విడిగానే లెక్క కట్టామని వెల్లడించారు. గత ఐదు ఏళ్లగా మార్చ్ నెలలో 46 శాతం వినియోగం, ఏప్రిల్ నెలలో మరో 4 శాతం ఎక్కువ వినయోగం ఉంటుందన్నారు. అందుకే ఏప్రిల్ నెలలో అధికంగా ఉన్న నాలుగు శాతాన్ని మార్చిలో కలిపినట్లు సీఎండీ […]
వినియోగదారుల దగ్గర అదనపు కరెంట్ బిల్లులు వసూలు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. మార్చ్, ఏప్రిల్ బిల్లులు కలిపి ఇచ్చారని కొంతమంది అపోహ పడుతున్నారని, రెండు బిల్లులు విడిగానే లెక్క కట్టామని వెల్లడించారు. గత ఐదు ఏళ్లగా మార్చ్ నెలలో 46 శాతం వినియోగం, ఏప్రిల్ నెలలో మరో 4 శాతం ఎక్కువ వినయోగం ఉంటుందన్నారు. అందుకే ఏప్రిల్ నెలలో అధికంగా ఉన్న నాలుగు శాతాన్ని మార్చిలో కలిపినట్లు సీఎండీ పేర్కొన్నారు. రెండూ 50 శాతం, 50 శాతంగా లెక్క కట్టి విద్యుత్ బిల్లులు ఇవ్వటంతో స్లాబ్ మారే ఛాన్స్ లేదన్నారు. ఏప్రిల్ నెలలో అదనంగా వచ్చిన యూనిట్లలను మార్చి నెలలో కలిపినట్లు ఆయన స్పష్టం చేశారు. మార్చి నెలకి ఏప్రిల్ నెలకి బిల్లులు వేరువేరుగా మెసేజీలు పంపుతున్నామని, ప్రాబ్లమ్స్ పరిష్కారం కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను సైతం నియమించామన్నారు. విద్యుత్ బిల్లులపై ఎక్కడైనా అనుమానాలు ఉంటే 1912కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయవచ్చని ఏపీ ట్రాన్స్ కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ వెల్లడించారు.