AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కోటి మార్క్ దాటిన కరోనా పాజిటివ్ కేసులు.. 95 శాతాన్ని దాటిన రికవరీ రేటు.. పూర్తి వివరాలివే.!!

దేశంలో గడిచిన 24 గంటల్లో 25,153 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసులు కోటి మార్కును దాటేశాయి.

దేశంలో కోటి మార్క్ దాటిన కరోనా పాజిటివ్ కేసులు.. 95 శాతాన్ని దాటిన రికవరీ రేటు.. పూర్తి వివరాలివే.!!
Ravi Kiran
|

Updated on: Dec 19, 2020 | 11:32 AM

Share

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 25,153 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసులు కోటి మార్కును దాటేశాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,04,599 చేరుకుంది. 325 రోజుల్లో ఈ మార్కును చేరుకోవడం గమనార్హం. ఇందులో 3,08,751 యాక్టివ్ కేసులు ఉండగా.. 95,50,712 కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా 347 మంది వైరస్ కారణంగా చనిపోవడంతో.. దేశంలో ఇప్పటివరకు 1,45,136 కరోనా మరణాలు సంభవించాయి.

అటు గత కొద్దిరోజులుగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేకపోవడం ఊరటను ఇచ్చే అంశం. అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో శుక్రవారం 11,71,868 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. మొత్తం నిర్ధారణ పరీక్షల సంఖ్య 16 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 3.09 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది. దేశంలో 95.46 శాతానికి రికవరీ రేటు చేరిందంది.

Also Read:

సాధారణ రైళ్ల రాకపోకల తిరిగి ప్రారంభమయ్యేది ఎప్పుడంటే.? కీలక ప్రకటన చేసిన రైల్వే శాఖ.!!

నా కెరీర్‌కు బిగ్ బాస్ వల్ల ఎలాంటి ఉపయోగం జరగలేదు.. వైరల్ అవుతున్న పునర్నవి షాకింగ్ కామెంట్స్..

డేటింగ్ యాప్ మాయ.. కిలాడీ యువతుల నగ్న వీడియో కాల్.. అసలు కథంతా అప్పుడే జరిగింది.?

తెలంగాణలో స్కూళ్లు ప్రారంభమయ్యేది అప్పుడే.!! మూడు నెలలు తరగతులు.? పూర్తి వివరాలివే..