రాంబన్ జిల్లాలో లోయలో పడ్డ కారు.. 11 మంది దుర్మరణం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం వేగంగా వచ్చిన ఎస్యూవీ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 15 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం వేగంగా వచ్చిన ఎస్యూవీ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 15 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.




