ఉద్రిక్త పరిస్థితుల వేళ.. సైన్యం కోసం భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ :  భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్న వేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సైన్యం కోసం 10లక్షల మల్టీ మోడల్ హ్యాండ్ గ్రెనేడ్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. రక్షణరంగంలో అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం భారత ప్రభుత్వం మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా 10లక్షల హ్యాండ్ గ్రెనేడ్లు కొనాలని ప్లాన్ చేసినట్టు ఆ వార్తా సంస్థ వెల్లడించింది. గత వారం రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ […]

ఉద్రిక్త పరిస్థితుల వేళ.. సైన్యం కోసం భారత ప్రభుత్వం కీలక నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2019 | 4:13 PM

న్యూఢిల్లీ :  భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్న వేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సైన్యం కోసం 10లక్షల మల్టీ మోడల్ హ్యాండ్ గ్రెనేడ్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. రక్షణరంగంలో అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం భారత ప్రభుత్వం మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా 10లక్షల హ్యాండ్ గ్రెనేడ్లు కొనాలని ప్లాన్ చేసినట్టు ఆ వార్తా సంస్థ వెల్లడించింది. గత వారం రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన హైలెవల్ మీటింగ్‌లో దీనిపై చర్చ కూడా జరిపినట్టు తెలిపింది. 10లక్షల హ్యాండ్ గ్రెనేడ్లు కావాలంటే సుమారు రూ.500 కోట్ల ఖర్చు కానుంది. కాగా ఇప్పటికే రూ.700 కోట్లతో అమెరికాకు చెందిన ఓ సంస్థ నుంచి 75వేల సిగ్ సార్ రైఫిల్స్ కొనుగోలు చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది. మరోవైపు 7.5లక్షల ఏకే 203 రైఫిల్స్ తయారీ కోసం రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం HE-36 మోడల్ హ్యాండ్ గ్రెనేడ్లు వినియోగిస్తోంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు వీటిని తయారు చేసింది. అయితే కొత్తగా మల్టీ మోడల్ హ్యాండ్ గ్రెనేడ్‌ను DRDO అభివృద్ధి చేసింది. దీన్ని భారీ ఎత్తున తయారు చేసేందుకు ఆర్డర్ ఇవ్వాలని భావిస్తోంది. యుద్ధ సమయంలో హ్యాండ్ గ్రెనేడ్లు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. శత్రు స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేయడానికి పనికొస్తాయి.