AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: కోర్టులోనే తండ్రి హత్య.. మోసగాడు అంటూ కుటుంబంపై నిందలు.. కూతురు DSPగా నియామకం..

నిజానికి ఆయుషి 2015లో తన తండ్రి మరణించిన తర్వాతే పోలీసు అధికారిణి కావాలని..  నేరస్థులను పట్టుకోవాలని బాధితులకు న్యాయం చేయాలనీ నిర్ణయించుకుంది. ఆయుషి తాను కలను నెరవేర్చుకోవడానికి ఇదే కారణం. అయితే పీసీఎస్‌లో ఉత్తీర్ణత సాధించిన ఆయుషి మాట్లాడుతూ.. తాను డీఎస్పీ అయినప్పటికీ.. ఐపీఎస్ కావడమే తన టార్గెట్ అని చెప్పారు. 

Success Story: కోర్టులోనే తండ్రి హత్య.. మోసగాడు అంటూ కుటుంబంపై నిందలు.. కూతురు DSPగా నియామకం..
Ayushi Singh
Surya Kala
|

Updated on: Apr 08, 2023 | 3:31 PM

Share

ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్ విడుదల చేశారు. ఈ పరీక్షలో మొరాదాబాద్‌కు చెందిన ఆయుషి సింహ కూడా ఉత్తీర్ణత సాధించారు. ఆయుషి సాధించిన సక్సెస్ కు ఆమె కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది. అయితే ఈ విజయం వెనుక ఒక దుఃఖం దాగి  ఉంది. వాస్తవానికి ఎనిమిదేళ్ల క్రితం ఆయుషి తండ్రి యోగేంద్ర సింగ్ అలియాస్ ‘భురా’ కోర్టులో హాజరుపరిచే సమయంలో హత్య చేయబడ్డాడు. ఆ సమయంలో ఆయుషి సింగ్ తండ్రి మొరాదాబాద్‌లోని దిలారీ మాజీ బ్లాక్ చీఫ్.

ఆ సమయంలో ఆయుషి తండ్రి యోగేంద్ర సింగ్ భూరాపై హత్యతో పాటు అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆయుషి తండ్రి వంచకుడు అనే పేరు రావడానికి ఇదే కారణం. ఎందుకంటే ఆయుషి తండ్రి మోసగాడు.. ఆ కుటుంబం పై నిందలు పడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు అదే కుటుంబం DSP ఆయుషి సింహ కుటుంబంగా పిలువబడుతుంది. ఆయుషి సింగ్ రెండో ప్రయత్నంలో పీసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.

నిజానికి ఆయుషి 2015లో తన తండ్రి మరణించిన తర్వాతే పోలీసు అధికారిణి కావాలని..  నేరస్థులను పట్టుకోవాలని బాధితులకు న్యాయం చేయాలనీ నిర్ణయించుకుంది. ఆయుషి తాను కలను నెరవేర్చుకోవడానికి ఇదే కారణం. అయితే పీసీఎస్‌లో ఉత్తీర్ణత సాధించిన ఆయుషి మాట్లాడుతూ.. తాను డీఎస్పీ అయినప్పటికీ.. ఐపీఎస్ కావడమే తన టార్గెట్ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

సక్సెస్‌పై ఆయుషి ఏం చెప్పారంటే? తాను సాధించిన ఘనత తన తండ్రి కల అని ఆయుషి చెప్పారు. మొదటి నుంచి తండ్రికి తాను పోలీసు అధికారి కావాలనే కోరిక ఉండేదన్నారు. అప్పుడు తన తండ్రి కల నెరవేరింది. తమ చదువుల కోసం మొరాదాబాద్‌లో తండ్రి ఇల్లు కట్టారని ఆయుషి గుర్తు చేశారు. తన తండ్రిని కాల్చి చంపిన సమయంలోనే .. భవిష్యత్తులో పోలీసు అధికారి కావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రిజల్ట్ రాగానే వెంటనే ఫోన్ చేసి తన తల్లికి సమాచారం ఇచ్చానని చెప్పారు. తన తల్లి తన ఉద్యోగం గురించి ఎంతో ఉద్వేగానికి లోనైంది.. ఎట్టకేలకు నేను నాన్న కలను నెరవేర్చారు. అమ్మ మాట వినగానే నా రిజల్ట్ వచ్చిన ఆనందం మరింత పెరిగిందని ఆయుషి తెలిపింది. ఇప్పుడు ఆఫీసర్‌గా నియమించబడడం చాలా సంతోషంగా ఉంది. తన విజయంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని చెప్పారు ఆయుషి.

ఢిల్లీలో గ్రాడ్యుయేషన్  ఆయుషి తన హైస్కూల్, ఇంటర్మీడియట్ మొరాదాబాద్‌లో చదివింది. అనంతరం గ్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీకి వెళ్ళింది. 2019 లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. అనంతరం 2021లో పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ చేశారు. NET పరీక్షలో కూడా సక్సెస్ అందుకుంది. గత రెండేళ్లుగా యూపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతోంది. ఇప్పుడు ఇందులో విజయం సాధించారు.

ఆయుషి తండ్రి ఎవరంటే? విద్యార్థి నాయకుడు.. షార్ప్ షూటర్ రింకూ చౌదరి 2013 మార్చి 4న హత్యకు గురైన కేసులో యోగేంద్ర సింగ్ అలియాస్ భురా పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో జనవరి 20న భురా కోర్టులో లొంగిపోయాడు. అప్పటి నుండి, భూరా, అతని సహచరులు మొరాదాబాద్ జైలులో ఉన్నారు. ఆ తర్వాత 2015లో ఫిబ్రవరి 23న కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. అదే సమయంలో రింకూ సోదరుడు సుమిత్ పోలీసుల అదుపులో ఉన్న భురాపై కాల్పులు జరిపారు. భురాను ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు అప్పటికే భుర  చనిపోయినట్లు ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us