Milk Production: పాల ఉత్పత్తి పెరగడానికి వేసవిలో ఈ గడ్డిని అందించండి.. రిజల్ట్ పక్కా..

వేసవి కాలంలో జంతువులు నీరసంగా ఉంటాయి. అంతేకాదు పశుగ్రాసం తీసుకోవడం కూడా తగ్గతుంది. దీని కారణంగా పాలు ఇచ్చే సామర్థ్యం తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు పశువులకు ప్రత్యేకమైన పచ్చి గడ్డిని ఆహారంగా అందిస్తే.. పశువులు మునుపటిలా పాలు ఇస్తూనే ఉంటాయి.

Milk Production: పాల ఉత్పత్తి పెరగడానికి వేసవిలో ఈ గడ్డిని అందించండి.. రిజల్ట్ పక్కా..
Milk Production
Follow us

|

Updated on: Jun 10, 2023 | 10:52 AM

వేసవి కాలం.. ఎండ వేడి.. వడగాల్పులు తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. ఉదయం 10 గంటలకే, ఎండ వేడితో మనుషులతో పాటు పశువులు కూడా అల్లాడిపోతున్నాయి. అధిక వేడి కారణంగా పశువులు కూడా తక్కువ పాలను ఉత్పత్తినిస్తాయి. ఎండ వేడి, వడగాల్పులతో పాల ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. అయితే ఇప్పుడు రైతులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైతు సోదరులు వేసవి కాలంలో కూడా మునుపటిలా పశువుల నుంచి అధిక పాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. దీని కోసం పశుగ్రాసంలో కొంత ప్రత్యేకమైన గడ్డిని కలుపుతూ జంతువులకు ఆహారాన్ని అందించాలి.

పశువైద్యుల అభిప్రాయం ప్రకారం.. వేసవి కాలంలో జంతువులు నీరసంగా ఉంటాయి. అంతేకాదు పశుగ్రాసం తీసుకోవడం కూడా తగ్గతుంది. దీని కారణంగా పాలు ఇచ్చే సామర్థ్యం తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు పశువులకు ప్రత్యేకమైన పచ్చి గడ్డిని ఆహారంగా అందిస్తే.. పశువులు మునుపటిలా పాలు ఇస్తూనే ఉంటాయి. మంచి పశుగ్రాసంతో పాటు ఆవు, గేదెలను ఎప్పుడూ నీడలో కట్టి ఉదయం, సాయంత్రం నీళ్లతో స్నానం చేయించాలి. దీని వల్ల వేసవి కాలంలో పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో పశువులకు తినిపించే ప్రధానమైన మూడు గడ్డి గురించి ఈరోజు తెలుసుకుందాం..

నేపియర్ గడ్డి: నేపియర్ గడ్డి ప్రధానంగా థాయిలాండ్ నుండి వచ్చిన గడ్డి. అయితే ఇప్పుడు ఈ గడ్డి  భారతదేశంలోని రైతులు కూడా పెంచుతున్నారు. ఈ గడ్డి సరిగ్గా చెరకు లాగా ఉంటుంది. భారతదేశంలోని ప్రజలకు ఇది ఏనుగు గడ్డి పేరుతో తెలుసు. ఈ గడ్డిని బంజరు భూమిలో కూడా పెంచవచ్చు. ఈ గడ్డి సాగుకి తక్కువ ఖర్చు అవుతుంది. నేపియర్ గడ్డిలో సాధారణ ఆకుపచ్చ గడ్డి కంటే 20% ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అలాగే, 40 శాతం ముడి ఫైబర్ ఇందులో లభిస్తుంది. నేపియర్ గడ్డిని విత్తిన 45 రోజులలో పూర్తిగా తయారవుతుంది. రైతు సోదరులు వేసవిలో పశువులకు నేపియర్ గడ్డిని ఆహారంగా అందిస్తే.. పశువులు మునుపటిలా పాలు ఇస్తూనే ఉంటాయి.

ఇవి కూడా చదవండి

కంబాల మేత: పశుగ్రాసానికి సాగు చేయడానికి భూమి లేని రైతులు.. ఇంటి లోపల కంబాల మేతను పెంచుకోవచ్చు. సరిగ్గా ఫ్రిజ్ లా కనిపించే కంబాల మేత సాగు కోసం వార్డ్ రోబ్ లాంటి నిర్మాణాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ నిర్మాణాన్ని హైడ్రోపోనిక్స్ కంబాలా మెషిన్ అని కూడా అంటారు. ఈ యంత్రంలో గడ్డిని పెంచడానికి వివిధ రకాల అచ్చులను తయారు చేస్తారు. అందులో విత్తనాలను వేసి తద్వారా పచ్చి గడ్డిని సంవత్సరాల తరబడి పెంచవచ్చు. దీనిని పశువులకు మేతగా అందించవచ్చు. దీనిని ఆహారంగా అందిస్తే.. పశువులు మునుపటిలా పాలు ఇస్తూనే ఉంటాయి.

అజొల్లా పశువుల దాణా: అజొల్లా పశువుల దాణా అనేది నీటిపై పెరిగే ఒక రకమైన గడ్డి. ఇది జంతువులకు ప్రోటీన్ సప్లిమెంట్ అని పిలుస్తారు. అజొల్లా పశుగ్రాసంలో మెగ్నీషియం, రాగి, మాంగనీస్, భాస్వరం, ఇనుము,  కాల్షియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. దీనితో పాటు, పాల ఉత్పత్తిని పెంచే అమైనో ఆమ్లాలు, ప్రోబయోటిక్స్, బయో-పాలిమర్లతో సహా అనేక రకాల విటమిన్లు కూడా ఈ పశుగ్రాసంలో అధికంగా ఉంటాయి.  అజొల్లా దాణాను పశువులకు ఆహారం ఇవ్వడం ద్వారా ఎక్కువ  పాలు ఇస్తూనే ఉంటాయి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..