Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండు ఒక వరం.. పుష్కలమైన పోషకాలు..

ప్రతి పదిమందిలో ఏడు మంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధిని అదుపు చేసేందుకు ఓ ప్రత్యేక పండు ఉంది. ఇది తింటే ఈ రోగం మీ నుంచి పారిపోతుంది.

Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండు ఒక వరం.. పుష్కలమైన పోషకాలు..
Diabetes
Follow us

|

Updated on: Oct 15, 2022 | 9:36 AM

ప్రస్తుత కాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్య డయాబెటిస్..ఆహార లోపాలు, వ్యాయామం లేకపోవడం వల్ల దేశంలో మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. ప్రతి పదిమందిలో ఏడు మంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఒక వేళ ఈ వ్యాధి సోకితే దాన్ని నియంత్రించవచ్చు కానీ పూర్తిగా నిర్మూలించలేం. ఈ వ్యాధి క్రమంగా శరీరం లోపల బోలుగా మారుతుంది. ఐతే ఈ వ్యాధిని అదుపు చేసేందుకు ఓ ప్రత్యేక పండు ఉంది. ఇది తింటే ఈ రోగం మీ నుంచి పారిపోతుంది. ఈ రోజు మనం షుగర్ లెవెల్‌ను నియంత్రించే ఒక అద్భుత పండు గురించి తెలుసుకోబోతున్నాం..దీనిని తీసుకోవడం ద్వారా మీరు భారీ ప్రయోజనాలను పొందుతారు. దానినే పేదవాడి ఆపిల్‌.. జామపండు గురించి తెలిస్తే.. రోజుకు ఒక్కటైనా తింటారు. జామపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామపండే కదా అని తేలికగా తీసిపారేసే వారు ..ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రోజుకు ఒకటైనా తీసుకుంటారు. జామపండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు జామపండును తీసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తీపి చాలా తక్కువగా ఉంటుంది. జామ వినియోగం మీకు చాలా సహాయపడుతుంది. నిజానికి జామపండులో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇన్సులిన్ ఉత్పత్తిలో సహాయం చేయడం ద్వారా షుగర్‌ లెవల్స్‌ని కంట్రోల్‌ చేస్తుంది. జామకాయలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి తగినంత ఫైబర్ కూడా ఉంటుంది. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో ఈ పీచు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జామపండు చాలా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉన్నందున, దాని వినియోగం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

జామ ఆకులతో తయారు చేసే టీ చేసే మేలు.. డయాబెటిక్ రోగులకు దీని ఆకులు కూడా గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జామ ఆకు టీ తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. ఈ టీ తాగడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్ అదుపులో ఉంటాయి. జామ తొక్కతో చేసిన టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జామపండును ప్రతిరోజు తీసుకోవడం వల్ల థైరాయిడ్‌ నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో ముఖ్యంగా విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. జామకాయ రోజూ ఒకటి తింటే చాలు చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరచడంలోనూ జామపండు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు బరువును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి