బన్నీ-ఎన్టీఆర్లతో మల్టీస్టారర్.. కథాంశం కూడా చెప్పేసిన డైరెక్టర్..!
టాలీవుడ్లో మల్టీస్టారర్లకు మంచి క్రేజ్ ఉంది. ప్రేక్షకుల నుంచి మల్టీస్టారర్ చిత్రాలకు మంచి ఆదరణ లభించడంతో.. వీటిపై టాప్ హీరోలు సైతం ఆసక్తిని చూపుతున్నారు.
టాలీవుడ్లో మల్టీస్టారర్లకు మంచి క్రేజ్ ఉంది. ప్రేక్షకుల నుంచి మల్టీస్టారర్ చిత్రాలకు మంచి ఆదరణ లభించడంతో.. వీటిపై టాప్ హీరోలు సైతం ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ-ఎన్టీఆర్లతో మల్టీస్టారర్ తీయాలనుందని తన కోరికు బయటపెట్టారు యంగ్ డైరక్టర్.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన స్వరూప్ ఆర్జేఎస్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ల గురించి చెప్పుకొచ్చారు. ”మల్టీస్టారర్ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. బన్నీ-ఎన్టీఆర్లతో జాన్ విక్ స్టైల్ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించాలనుకుంటున్నా. పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కించాలన్నది నా డ్రీమ్. అలాగే ఆమిర్ ఖాన్- ప్రభాస్తో ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ను తెరకెక్కించాలనుకుంటున్నా. వీటితో పాటు నా ఆల్టైమ్ ఫేవరెట్ మెగాస్టార్ చిరంజీవిని డైరక్ట్ చేయాలనుకుంటున్నా” అని తన కోరికలను బయటపెట్టారు.
బన్నీ-ఎన్టీఆర్, ఆమిర్-ప్రభాస్.. ఈ కాంబినేషన్లలో మల్టీస్టారర్లు చేస్తే వాటికి కచ్చితంగా మంచి క్రేజ్ వస్తుంది. కానీ మల్టీస్టారర్ తీయాలంటే ఇద్దరికీ స్టోరీ నచ్చాలి. ఇద్దరి డేట్స్ కుదరాలి. ఇద్దరు స్టార్లతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దర్శకుడి కోరిక భవిష్యత్లో నెరవేరుతుందేమో చూడాలి. కాగా ప్రస్తుతం ఈ దర్శకుడు నవీన్తో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నారు. డిటెక్టివ్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించనున్నానని.. మరో రెండు నెలల్లో ఈ ప్రాజెక్ట్కు సంబంధించి మరిన్ని వివరాలు చెబుతానని ఆయన అన్నారు.
Read This Story Also: చిరుకు మరో షాక్.. ‘ఆచార్య’ నుంచి తప్పుకున్న కాజల్..?