చిరుకు మరో షాక్.. ‘ఆచార్య’ నుంచి తప్పుకున్న కాజల్..?
చిరంజీవికి మరో షాక్ తగిలిందా..? ఆచార్య నుంచి కాజల్ తప్పుకుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి టాలీవుడ్లో. కాగా ఈ సినిమా కోసం మొదట త్రిషను హీరోయిన్గా ప్రకటించారు.
చిరంజీవికి మరో షాక్ తగిలిందా..? ఆచార్య నుంచి కాజల్ తప్పుకుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి టాలీవుడ్లో. కాగా ఈ సినిమా కోసం మొదట త్రిషను హీరోయిన్గా ప్రకటించారు. అయితే క్రియేటివ్ ఢిపరెన్స్ల వలన ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇక ఆ తరువాత కాజల్ అగర్వాల్ లైన్లోకి వచ్చింది. చిరంజీవితో రెండోసారి తాను జత కట్టబోతున్నట్లు అధికారికంగా చందమామ కూడా ప్రకటించేసింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి కాజల్ కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి సినిమాకు ఓకే చెప్పకముందు తమిళ్లో ఓ సినిమాకు సంతకం చేసిందట కాజల్. దానికి అడ్వాన్స్ కూడా తీసుకుందట. అయితే ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్లకు బ్రేక్ పడింది. ఇక లాక్డౌన్ ఎత్తేసిన తరువాత మూవీల చిత్రీకరణ ప్రారంభం అయితే.. అన్నింటికి డేట్లు అడ్జెస్ట్ చేయడం కాజల్కు కష్టంగా మారనుందట. దీంతో చిరుకు సారీ చెప్పినట్లు టాక్ నడుస్తోంది. ఇక కాజల్ ఇచ్చిన షాక్తో టీమ్ మరో హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? మెగాస్టార్ మూవీ నుంచి కాజల్ తప్పుకుందా..? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్, అజయ్, సోనూసూద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనుండగా.. రెజీనా ప్రత్యేక గీతం మెరవనుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Read This Story Also: Breaking: భారత ఫుట్బాల్ లెజండ్ గోస్వామి కన్నుమూత..!