AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కండిషన్లు పెడుతోన్న రాములమ్మ..!

లేడి అమితాబ్ విజయశాంతి దాదాపుగా 13 సంవత్సరాల తరువాత వెండి తెరపైన కనిపించబోతోంది. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ద్వారా విజయశాంతి టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో విజయశాంతి కనిపించనుంది. అయితే ఈ సినిమాపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయశాంతి.. గతంలోనూ ఓ సినిమా కోసం అనిల్ రావిపూడి తనను సంప్రదించారని.. కానీ ఈ సినిమాలో పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని, అందుకే ఒప్పుకున్నానని తెలిపింది. ఇక అనిల్ […]

కండిషన్లు పెడుతోన్న రాములమ్మ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 03, 2020 | 9:07 PM

Share

లేడి అమితాబ్ విజయశాంతి దాదాపుగా 13 సంవత్సరాల తరువాత వెండి తెరపైన కనిపించబోతోంది. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ద్వారా విజయశాంతి టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో విజయశాంతి కనిపించనుంది. అయితే ఈ సినిమాపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయశాంతి.. గతంలోనూ ఓ సినిమా కోసం అనిల్ రావిపూడి తనను సంప్రదించారని.. కానీ ఈ సినిమాలో పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని, అందుకే ఒప్పుకున్నానని తెలిపింది. ఇక అనిల్ రావిపూడి సైతం మాట్లాడుతూ.. ఈ పాత్రలో విజయశాంతిని తప్ప మరెవరినీ ఊహించుకోలేనని వెల్లడించారు. ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు కచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తోన్న విజయశాంతి.. ఇకపై వరుస సినిమాలను చేయాలని భావిస్తోందట. అయితే ఏదైనా సినిమా తను ఒప్పుకునేందుకు మాత్రం రెండు కండిషన్లు పెడుతోంది ఈ రాములమ్మ.

అందులో ఒకటి రెమ్యునరేషన్. పారితోషికం విషయంలో ఏ మాత్రం తగ్గనని విజయశాంతి చెబుతోందట. ఆమె పారితోషికం ఇప్పటి స్టార్ హీరోయిన్ల కంటే చాలా ఎక్కువని సమాచారం. అంతేకాదు ఏదో ఒక చిన్న పాత్ర ఇస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తుందట. అలాగే తల్లి పాత్రలు కూడా అన్ని చేయనని.. సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటేనే నటిస్తానని ఈ సీనియర్ హీరోయిన్ చెబుతోందట. ఇవి ఉంటేనే ఏదైనా ప్రాజెక్ట్‌కు ఓకే చెప్తానని ఆమె చెబుతోందట. కాగా అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రానికి కూడా విజయశాంతిని ఓకే చెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన తదుపరి చిత్రంగా ఎఫ్ 2 సీక్వెల్‌ను అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ మళ్లీ కలిసి నటించబోతున్నారని టాక్.